హాస్టల్ లో తోటి మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు, ఫొటోలు లీక్.. ఇద్దరి అరెస్ట్...
ప్రియుడి కోసం ఓ మహిళ దారుణానికి తెగించింది. ఏకంగా హాస్టల్ లో ఉంటున్న తోటి మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు, ఫొటోలు అతనికి పంపించింది. విషయం బైటికి రావడంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
తమిళనాడు : మధురైలోని ఓ వసతి గృహంలో ఉన్న మహిళలు స్నానం చేసే ఫోటోలు, వీడియోలు తీసిన ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు రామనాథపురం జిల్లా కముది ప్రాంతానికి చెందిన కాళేశ్వరి అనే 31 ఏళ్ల మహిళ మధురైలోని ఓ ప్రైవేట్ లేడీస్ హాస్టల్లో ఉంటూ బీఈడీ చదువుతోంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన వైద్యుడు ఆశిక్ తో పరిచయం ఏర్పడింది. కాలేశ్వరి తాను ఉంటున్న హాస్టల్ లోని మహిళలు స్నానం చేసే వీడియోలు ఫోటోలు తీసి వాట్సాప్ లో ఆశిక్ పంపుతూ వచ్చింది.
రెండు రోజుల క్రితం ఆమెతోపాటు గదిలో ఉంటున్న మరో మహిళ ఆమె సెల్ఫోన్ పరిశీలించగా అందులో ఫోటోలు, వీడియోలు కనిపించాయి. షాక్ అయిన ఆమె విషయాన్ని వార్డెన్కు చెప్పింది. వార్డెన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆసిక్ ను, కాలేశ్వరం ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
‘ఉరి’ వేసుకునే ఆట.. తాడు బిగుసుకుని పదకొండేళ్ల బాలుడు మృతి
ఇదిలా ఉండగా, ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన ఓ మహిళ తన సొంత అత్తమామల నగ్న వీడియోలు తీసిన దారుణ ఉదంతం సెప్టెంబర్ 20న వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిబంగారు ఆభరణాల వ్యాపారి. అతనికి తన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త ఇటీవల గుర్తించాడు. బండారం బయటపడడంతో ఇంట్లో ఉన్న కోటి రూపాయలకుపైగా విలువైన ఆభరణాలు, కొంత నగదు తీసుకుని ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది.
దీంతో ఇది గుర్తించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో ఆమె భర్త కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. తమ ఇంట్లో అత్తామామల గదిలో రహస్య కెమెరాలు పెట్టానని.. వారు ఏకాంతంగా ఉన్నప్పుడు వారిని వీడియోలు తీసానని.. షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. తనపై కేసులు వెనక్కి తీసుకోకపోతే ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ భర్తను బెదిరించింది. దీంతో ఈ విషయాన్ని కూడా భర్త పోలీసులకు తెలిపాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు.