మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో మరో ఆఫ్రికన్ మగ చిరుత తేజస్ మరణించింది. సంభోగం సమయంలో ఆడ చిరుత నభాతో జరిగిన ఘర్షణలో తేజస్కు గాయాలు తగిలాయని, చికిత్స పొందేలోపే ఆ చిరుత మరణించిందని అధికారులు భావిస్తున్నారు. కానీ.. పోస్ట్మార్టం నివేదికను ఇంకా సమర్పించలేదు.
మధ్యప్రదేశ్లోని షియోపూర్లో ఉన్న కునో నేషనల్ పార్క్లో మరో చిరుత మృతి చెందింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మగ చిరుత తేజస్ మృతి చెందడంతో కూనో నిర్వహణలో కలకలం రేగింది. కునోలో చిరుతలు ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు చనిపోతున్నాయి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. పోస్ట్మార్టం నివేదిక తర్వాతే .. చిరుత తేజస్ మరణానికి గల కారణాలు తెలుస్తాయని కునో మేనేజ్మెంట్ చెబుతోంది. అయితే నమీబియా ఆడ చిరుత నభాతో సంభోగం సమయంలో తేజస్ పరస్పర వివాదంలో గాయపడిందని భావిస్తున్నారు. పశువైద్యులు చికిత్స ప్రారంభించేలోపే తేజస్ మృతి చెందిందని అంటున్నారు.
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో మానిటరింగ్ టీమ్ మగ చిరుత తేజస్ మెడ పైభాగంలో గాయం గుర్తులను చూసింది. ఈ విషయాన్ని బృందం వెంటనే పాల్పూర్ హెడ్ క్వార్టర్లో ఉన్న వన్యప్రాణి వైద్యులకు సమాచారం అందించింది. వైల్డ్ లైఫ్ డాక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని తేజస్ ఒంటిపై గాయాన్ని చూశారు. ఈ సమయంలో తేజస్కు మత్తు మందు ఇచ్చి చికిత్స కోసం సన్నాహాలు చేశారు. వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా చిరుత మృతి చెందింది.
సంభోగ పోరాటంలో గాయాలు!
బుధవారం భోపాల్ వాన్ విహార్కు చెందిన వెటర్నరీ డాక్టర్ అతుల్ గుప్తా, జబల్పూర్ వెటర్నరీ కాలేజీకి చెందిన డాక్టర్ కాజల్ కూనో చేరుకుని తేజస్ మృతదేహానికి పోస్ట్మార్టం చేస్తారు. కునో పార్క్లోని ఎన్క్లోజర్ నంబర్ 6లో చిరుత తేజస్ ఒంటరిగా ఉంది. ఎన్క్లోజర్ నంబర్ 5లో ఒక ఆడ చిరుత నాభాను సమీపంలో ఉంచారు. అవి రెండు కలువలనే ఉద్దేశంతో యాజమాన్యం 5వ నంబర్ కంచె గేటును తెరిచింది. కానీ.. ఆ రెండు చిరుతలు గొడవపడటంతోనే తేజస్ మృతి చెందిందని భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం తర్వాతే అసలు కారణం తెలియనుంది. పోస్టుమార్టం ద్వారా మరణానికి గల కారణాన్ని తేటతెల్లం చేస్తుందని పీసీసీఎఫ్ తెలిపింది.
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్) జస్వీర్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. మగ చిరుత తేజస్కు గాయాలు కావడంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం తర్వాతే మృతికి గల కారణాలు తెలియవచ్చన్నారు. మగ చిరుత తేజస్ను ఎన్క్లోజర్ నంబర్ 6లో ఒంటరిగా ఉంచారు, అయితే ఎన్క్లోజర్ నంబర్ 5లో ఉంచబడిన ఆడ చిరుత నాభా (సవన్నా)తో సంభోగం కోసం ఎన్క్లోజర్ మధ్యలో ఉన్న గేట్ తెరవబడింది. మగ చిరుత తేజస్ మెడపై గాయాల ఆనవాళ్లు కనిపించాయి. చిరుతల మధ్య పరస్పర ఘర్షణ జరిగే అవకాశం ఉందని తెలిపారు
కునో నేషనల్ పార్క్లో చిరుత పునరుజ్జీవనం కోసం నమీబియా మరియు దక్షిణాఫ్రికా నుండి 20 చిరుతలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పటివరకు 7 చిరుతలు ( 4పెద్దవి,3 పిల్లలు) వేర్వేరు కారణాల వల్ల మరణించాయి. ప్రస్తుతం కునోలో 16 చిరుతలు(పెద్దవి),1 పిల్ల చిరుత ఉంది. వీటిలో 12 చిరుతలను కునోలోని ఓపెన్ ఫారెస్ట్లో వదిలారు. 4 చిరుతలు, ఒక పిల్ల చిరుతను ఎన్క్లోజర్లో ఉంచారు.
కునో నేషనల్ పార్క్లో ఏ చిరుత ఎప్పుడు చనిపోయింది?
ఇప్పటివరకు 3 పిల్ల చిరుతలతో సహా 7 చిరుతలు చనిపోయాయి. నమీబియా,దక్షిణాఫ్రికా నుండి మొత్తం 20 చిరుతలను కునో నేషనల్ పార్క్కు తీసుకువచ్చారు, వాటిలో నమీబియా ఆడ చిరుత జ్వాల 4 పిల్లలకు జన్మనిచ్చింది. అయితే.. మార్చి 26, 2023న నమీబియా ఆడ చిరుత సాషా కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా మరణించింది. అలాగే..23 ఏప్రిల్ 2023న ఉదయ్ అనే మగ చిరుత కార్డియోపల్మోనరీ ఫెయిల్యూర్ కారణంగా మరణించింది.
దీని తరువాత మగ చిరుతలతో హింసాత్మక జోక్యం కారణంగా 9 మే 2023న దక్ష మరణించింది. నమీబియా ఆడ చిరుత సియాయా (జ్వాల 4 పిల్లలలో ఒకటి) మే 23న మరణించింది, ఆ తర్వాత మే 25న డీహైడ్రేషన్ కారణంగా రెండు చిరుతలు మరణించాయి. ఇప్పుడు జూలై 11, మంగళవారం, మరొక దక్షిణాఫ్రికా చిరుత తేజస్ బహుశా నమీబియా ఆడ చిరుత నభా (సవన్నా)తో హింసాత్మక చొరబాటు కారణంగా మరణించింది.
