Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో యూపీ బీజేపీ అధికార ప్రతినిధి మృతి !

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రా సోమవారం తెల్లవారుజామున కరోనాతో మృతి చెందారు. బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రాకు కోవిడ్ 19 పాజిటివ్ అని పరీక్షలో తేలడంతో అన్ని కాన్పూరులోని ఆస్పత్రిలో చేర్చారు. 

uttarpradesh spokesperson manoj mishra dies with corona possitve - bsb
Author
Hyderabad, First Published May 3, 2021, 11:06 AM IST

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రా సోమవారం తెల్లవారుజామున కరోనాతో మృతి చెందారు. బీజేపీ అధికార ప్రతినిధి మనోజ్ మిశ్రాకు కోవిడ్ 19 పాజిటివ్ అని పరీక్షలో తేలడంతో అన్ని కాన్పూరులోని ఆస్పత్రిలో చేర్చారు. 

అక్క మనోజ్ మిశ్రా కొవిడ్ కు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మరణించారు. మనోజ్ మిశ్రా మృతి పట్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. 

మనోజ్ మిశ్రా కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని సీఎం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. యూపీలో బీజేపీ కీలక నేత కరోనాతో మరణించడంతో ఆ పార్టీ నేతలు విషాదంలో మునిగిపోయారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

Follow Us:
Download App:
  • android
  • ios