Asianet News TeluguAsianet News Telugu

బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి, ముగ్గురు పిల్లలు పుట్టాక.. యువకుడి అరెస్ట్..

మైనర్ బాలికను వివాహం చేసుకుని, మూడేళ్లుగా కాపురం చేస్తున్న యువకుడిపై పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

uttarpradesh police registered a rape case against a young man who kidnapped and married a 15-year-old girl - bsb
Author
Hyderabad, First Published Jul 22, 2021, 10:18 AM IST

యూపీ : పదిహేనేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, పెళ్లాడి కాపురం చేసిన యువకుడిమీద పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌ జిల్లాలో వెలుగు చూసింది. 15 యేళ్ల మైనర్ బాలికను మూడేళ్ల క్రితం కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడు. 

వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మైనర్ బాలికను వివాహం చేసుకుని, మూడేళ్లుగా కాపురం చేస్తున్న యువకుడిపై పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదుమీద కేసు నమోదు చేసిన పోలీసులు మూడేళ్ల తరువాత అరెస్ట్ చేశారు. 

నిందితుడి ఆస్తిని సీజ్ చేసి, సమాచారం అందజేసిన వ్యక్తికి రూ. 25 వేల బహుమతి ఇచ్చారు. బాలికను కిడ్నాప్ చేసి, పెళ్లి చేసుకుని, మూడుళ్లు కాపురం చేసి, పిల్లలు పుట్టాక పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios