భార్యపై అనుమానం.. నిద్రిస్తుండగా గొంతు కోసి హత్య చేసిన భర్త
Uttar Pradesh: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త నిత్యం ఆమెతో గొడవ పడుతుండే వాడు. ఈ క్రమంలోనే ఆమె నిద్రిస్తున్న సమయంలో పదునైనా కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు.
75-year-old man kills 66-year-old wife : భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త నిత్యం ఆమెతో గొడవ పడుతుండే వాడు. ఈ క్రమంలోనే ఆమె నిద్రిస్తున్న సమయంలో పదునైనా కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లా అసోథర్ ప్రాంతంలో తన 66 ఏళ్ల భార్యను చంపినందుకు 75 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. భార్య తీరుపై అనుమానం వచ్చిన వ్యక్తి ఆమె నిద్రిస్తున్న సమయంలో పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి ప్రాణాలు తీశాడు.
సదరు భర్త చాలా కాలం నుంచి భార్యపై అనుమానంగా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్య ప్రాణాలు తీయాలనుకున్నాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో అత్యంత క్రూరంగా గొంతు కోసి ప్రాణాలు తీశాడు. అయితే, నిందితుడి ఇంటి వరండాపై గ్రామస్థులు రక్తాన్ని చూడటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. రక్తన్ని చూసిన గ్రామస్థులు ఇంట్లోకి చేరుకుని చూడగా.. బాధితురాలు లలితాదేవి మృతదేహం మంచం కింద రక్తపు మడుగులో పడి ఉండటం గమనించారు. దీని గురించి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడైన భర్త శివ బరన్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నేరాన్ని చేసినట్టు అంగీకరించిన భర్త..
ఘనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. ఈ దారుణానికి ఒడిగట్టి భర్తను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడిని విచారించగా.. ఈ నేరం తానే చేసినట్టు అంగీకరించాడు. గత కొంతకాలంగా లలితా దేవి నడవడికలో మార్పు వచ్చింద తెలిపిన నిందితుడు.. ఆమెపై తనకు అనుమానం ఉందని తెలిపాడు. అందుకే ఆమె వెళ్లిన ప్రతిచోటా ఆమెతో పాటు వెళ్తానని వెల్లడించాడు. ఈ విషయంపై తరచుగా తగాదాలు జరగడంతో ఆలస్యంగా వారి సంబంధంలో ఇది చాలా వివాదానికి కారణమైంది. అయినప్పటికీ, అతను ఇంకా అనుమానం మరింతగా పెంచుకున్నాడు. దీని గురించే బుధవారం రాత్రి గొడవ జరిగింది. ఇక రాత్రి ఆమె వరండాలో గాఢనిద్రలో ఉన్న సమయంలో భర్త.. పదునైన కత్తితో క్రూరంగా ఆమె గొంతు కోసి హత్య చేశాడు.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఆమె భర్తేనని తెలిపారు. గత కొంత కాలంగా తన భార్య పై అనుమానం పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆమె నిద్ర పోతున్న సమయంలో పదునైన ఆయుధంతో హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాము. కేసు నమోదుచేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నాం" అని తెలిపారు. ఇదిలావుండగా, రెండో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన కేసులో... భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని దర్యాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.