Asianet News TeluguAsianet News Telugu

ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే అంతే సంగతి... యూపీ సిఎం యోగి సీరియస్ యాక్షన్

ఐజీఆర్ఎస్, సీఎం హెల్ప్‌లైన్, సంపూర్ణ సమాధాన్ దివస్ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరియా, భదోహి, గోండా జిల్లాల్లో ఫిర్యాదుదారుల నుండి అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

UP CM Yogi Seeks Report From DMs SSPs Over Complaint Redressal Shortcomings AKP
Author
First Published Oct 1, 2024, 12:14 AM IST | Last Updated Oct 1, 2024, 12:14 AM IST

లక్నో : ఐజీఆర్ఎస్, సీఎం హెల్ప్‌లైన్, సంపూర్ణ సమాధాన్ దివస్ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా పరిగణించారు. గత కొన్ని రోజులుగా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యంపై సీఎం యోగికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన సంబంధిత జిల్లాల డీఎంలు, ఎస్ఎస్పీలు, ఎస్పీల నుండి నివేదిక కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎంలు, ఎస్ఎస్పీలు, ఎస్పీలపై వేటు తప్పదని తెలుస్తోంది.

దేవరియా, భదోహి, గోండా ఫిర్యాదుదారుల నుండి వ్యక్తమైన అసంతృప్తి

కొన్ని రోజుల క్రితం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఐజీఆర్ఎస్, సీఎం హెల్ప్‌లైన్, సంపూర్ణ సమాధాన్ దివస్ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తప్పుబట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై నివేదిక కోరారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ఐజీఆర్ఎస్, సీఎం హెల్ప్‌లైన్, సంపూర్ణ సమాధాన్ దివస్ ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 1 నుండి 25వ తేదీ వరకు అందిన ఫిర్యాదుల పరిష్కారంలో అనేక జిల్లాల పనితీరు అంతంత మాత్రంగానే ఉందని ఆయన గుర్తించారు. సీఎం హెల్ప్‌లైన్, సీఎం డాష్‌బోర్డుల ద్వారా ఫిర్యాదుల పరిష్కారంపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవరియా, భదోహి, గోండా, లలిత్‌పూర్, ప్రయాగరాజ్, కౌశాంబి, ఫతేపూర్, అజామ్‌గఢ్, మీర్జాపూర్ జిల్లాలు ఇందులో ఉన్నాయి.

ఫిర్యాదుల పరిష్కారంపై 70 శాతం మంది ఫిర్యాదుదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ సంబంధిత జిల్లాల డీఎంలు, ఎస్ఎస్పీలు, ఎస్పీలను మందలించి, తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు. సమీక్ష సమావేశ నివేదికను సీఎం కార్యాలయానికి అందజేయనున్నారు. నివేదిక అందగానే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.

ఆగస్టు, సెప్టెంబర్‌లో ఫిర్యాదుల పరిష్కారంలో అద్భుతంగా రాణించిన ఔరైయా, లఖింపూర్, మీరట్

సమీక్ష సమావేశంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఐజీఆర్ఎస్, సీఎం హెల్ప్‌లైన్ ఫిర్యాదుల పరిష్కారంలో కొన్ని జిల్లాలు అద్భుతంగా రాణించాయని ప్రధాన కార్యదర్శి గుర్తించారు. సకాలంలో ఫిర్యాదులను పరిష్కరించి స్పెషల్ క్లోజ్ రిపోర్ట్ సమర్పించాయి. ఆగస్టు నెలలో ఔరైయా, లఖింపూర్ ఖేరీ, లక్నో జిల్లాలు ఉండగా, సెప్టెంబర్ నెలలో ఔరైయా, లఖింపూర్ ఖేరీ, మీరట్, సహారన్‌పూర్, గోరఖ్‌పూర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల డీఎంలు, ఎస్ఎస్పీలు, ఎస్పీలను ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ అభినందించారు. మిగతా జిల్లాలు కూడా వీటిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios