NCERT సిలబస్‌లో మార్పు: : NCERT 2023-24 అకడమిక్ కోసం సిలబస్‌లో మార్పులు చేసింది. అనేక అధ్యాయాలు తొలగించబడ్డాయి. 2022 సంవత్సరంలోనే మార్పులు చేయాలని సమాచారం.12వ తరగతి చదువుతున్న విద్యార్థులు మొఘలాల చరిత్ర పూర్తి దూరం కానున్నది.అలాగే.. NCERT హిందీ, పౌరశాస్త్రం సిలబస్‌లో ఈ మార్పులు జరుగునున్నది

NCERT సిలబస్‌లో మార్పు: భారతీయ చరిత్ర లో స్వదేశీ , భారత దేశ రాజుల చరిత్రకు తగిన ప్రాధాన్యం లేదనే వాదన ఎప్పటినుంచో ఉంది. మన దేశంపై దండయాత్రలు చేసిన రాజుల చరిత్రకు పెద్దపీఠ వేశారనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ క్రమంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కీలక నిర్ణయం తీసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతికి సంబంధించి హిస్టరీ, హిందీ , సివిక్స్‌లో కొన్ని మార్పులు చేసింది. NCERT 2022లో ఈ మార్పుల గురించి సమాచారాన్ని అందించింది, అయితే ఈ మార్పులు ఇప్పుడు అమలు చేయబడతాయి. వాస్తవానికి కరోనా కాలం కారణంగా, NCERT చేసిన మార్పుల కారణంగా కొత్త పుస్తకాలు ప్రచురించబడలేదు. ఇప్పుడు అవి 2023-24 కొత్త అకడమిక్ సెషన్‌లో అమలు చేయబడతాయి. మార్పులతో పాటు కొత్త పుస్తకాలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సిలబస్‌లో కొత్త మార్పు దేశవ్యాప్తంగా NCERT పుస్తకాలు బోధించే అన్ని పాఠశాలలకు వర్తిస్తుంది.

చరిత్రలో పలు ఛాపర్ల తొలగింపు.. 

12వ తరగతికి చెందిన ‘థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ- పార్ట్2’ పుస్తకంలో నుంచి కింగ్స్ అండ్ క్రానికల్స్' , 'ది మొఘల్ కోర్ట్స్' పాఠ్యాంశాలను NCERT పూర్తిగా తొలగించింది. అలాగే.. అదేవిధంగా, సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్, క్లాష్ ఆఫ్ కల్చర్స్ , ఇండస్ట్రియల్ రివల్యూషన్‌కు సంబంధించిన పాఠాలు కూడా 11వ తరగతి పాఠ్యపుస్తకం థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ నుండి తొలగించబడ్డాయి. ఫలితంగా 12వ తరగతికి చెందిన NCERT విద్యార్థులు మొఘలల చాప్టర్‌కి పూర్తిగా గుడ్ బై చెప్పినట్లే. 

 పౌరశాస్త్రం సిలబస్ లో కూడా మార్పు

12వ తరగతి విద్యార్థులకు పౌరశాస్త్రం సిలబస్ కూడా మారనుంది. సివిక్స్ పుస్తకం నుండి 'యుఎస్ హెజెమోనీ ఇన్ వరల్డ్ పాలిటిక్స్' , 'ది కోల్డ్ వార్ ఎరా' అనే పాఠ్యాంశాలు తొలగించబడ్డాయి.దీంతో 'సామూహిక ఉద్యమం'ను సివిక్స్ పుస్తకం నుంచి తొలగించారు. ఇందులో కాంగ్రెస్, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలు నేర్పారు. పాలిటిక్స్ ఇన్ ఇండియా సైన్స్ ఇండిపెండెన్స్’ పుస్తకంలో నుంచి ‘రైజ్ ఆఫ్ పాపులర్ మూవ్‌మెంట్స్’, ‘ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్’ పాఠ్యాంశాలు కూడా కనుమరుగు కానున్నాయి.

అదే విధంగా 10వ తరగతికి చెందిన ‘డెమొక్రటిక్ పాలిటిక్స్ 2 ’ టెక్ట్స్‌బుక్ నుంచి డెమొక్రసీ అండ్ డైవర్సిటీ, చాలెంజెస్‌ టు డెమొక్రసీ, పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూవ్‌‌మెంట్స్ అనే పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయించింది. అలాగే.. హిందీ పుస్తకం నుండి చాలా పాటలు తొలగించబడ్డాయి. సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా పాడిన 'గానే దో ముఝే' పాట తొలగించబడింది. విష్ణు ఖరే కవిత 'సత్య' కూడా తొలగించబడింది.