ఛత్తీస్గడ్లో మళ్లీ మూక దాడి చోటుచేసుకుంది. బీఫ్ అమ్ముతున్నారని ఇద్దరిపై మూక దాడి చేసింది. బెల్ట్తో దాడి చేసింది. అర్దనగ్నంగా ఊరేగించింది. వారి వెనుక మూక వెళ్లింది. చాలా మంది వీరిని వీడియో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
భోపాల్: ఛత్తీస్గడ్లోని బిలాస్పూర్లో ఓ మూక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్ అమ్ముతున్నారని ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. అర్ధనగ్నంగా ఊరేగించారు. చాలా మంది ఆ ఘటనను తమ సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. ఆన్ రికార్డులోనే ఒకరు బెల్ట్తో దాడి చేయడం ఆ వీడియో కనిపిస్తున్నది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 33 కిలోల బీఫ్ను రికవరీ చేసుకున్నారు.
పోలీసుల ప్రకటన ప్రకారం, సుమిత్ నాయక్ నిన్న ఈ ఫిర్యాదు చేశారు. 50 ఏళ్ల నర్సింగ్ దాస్, 52 ఏళ్ల రామ్నివాస్ మెహర్ అనే ఇద్దరూ ఓ బైక్పై తెల్లటి సంచిలో బీఫ్ను తీసుకెళ్లుతున్నారు. వారిని ఫిర్యాదు చేసిన వారు అడ్డుకున్నారు. ఆ తెల్లటి సంచిలో ఏమున్నదో అడిగారు. అందులో బీఫ్ ఉన్నదని వారు తెలిపినట్టు ఫిర్యాదు చేసిన వ్యక్తి పోలీసులకు చెప్పారు. వారిద్దరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Also Read: ఇప్పటి వరకు ఐదుగురిని చంపేశాం.. మూకదాడులపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్
33.5 కిలోల బీఫ్ను రికవరీ చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారిద్దరినీ పోలీసు కస్టడీలోకి తీసుకున్నట్టు వివరించారు. వారిని ఈ రోజు కోర్టులో హాజరుపరిచినట్టు చెప్పారు. ఆ మాంసాన్ని వెటరినరీ డాక్టర్ వద్దకు పరీక్ష చేయడానికి పంపించినట్టు పేర్కొన్నారు. కానీ, ఆ పరీక్షకు సంబంధించిన నివేదికపై ఎలాంటి సమాచారం లేదు.
కాగా, బీఫ్ దొరికిన ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. కానీ, వారిపై దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో అనే విషయంపై సమాచారం లేదు.
