Asianet News TeluguAsianet News Telugu

దారుణం : గుడిసెకు వెళ్లాడుతున్న పిల్లల శవాలు...!

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. పూరి గుడిసెలో ఇద్దరు బాలురు దారుణ హత్యకు గురైన సంఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. పూరి గుడిసెలో ఇద్దరు పిల్లల శవాలు వెలుగు చూసిన ఘటన జార్ఖండ్‌లోని రాంచీలో ఆదివారం చోటుచేసుకుంది. 

Two boys beaten to death in jharkhand - bsb
Author
Hyderabad, First Published Jan 26, 2021, 7:29 AM IST

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. పూరి గుడిసెలో ఇద్దరు బాలురు దారుణ హత్యకు గురైన సంఘటన ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. పూరి గుడిసెలో ఇద్దరు పిల్లల శవాలు వెలుగు చూసిన ఘటన జార్ఖండ్‌లోని రాంచీలో ఆదివారం చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్‌, రాంచీకి సమీపంలోని చన్హా ప్రాంతానికి చెందిన మనీష్‌ ఓరన్‌(12), గణేష్‌ భగవత్‌(1​‍6)లు ఆదివారం ఓ పొలంలోకి వెళ్లే విషయమై కొంతమంది బాలురతో గొడపడ్డారు. 

ఆ సాయంత్రమే గ్రామ శివారులోని పూరి గుడిసెలో శవాలై కనిపించారు. మనీష్‌ శవం గుడిసెకు వేళాతుండగా.. భగవత్‌ శవం నేలపై పడి ఉంది. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అక్కడి నేలపై ఓ కర్రను గుర్తించారు. ఆ కర్రతోటే ఇద్దర్నీ కొట్టి చంపినట్లు భావిస్తున్నారు. 

ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, చిన్నారుల మృతిపై ఆగ్రహానికి గురైన గ్రామస్తులు రాంచీ-పలాము జాతీయ రహదారిని దిగ్భందించి నిరసనలు తెలియజేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios