కర్ణాటకలోని ఉడిపిలో ఓ వైద్య సంస్థకు చెందిన ముగ్గురు అమ్మాయిలు మహిళల వాష్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా మరో విద్యార్థిని వీడియో తీసినందుకు సస్పెండ్ అయ్యారు. ఈ సంఘటన పెద్ద క్రైం రాకెట్‌లో భాగమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది 1992నాటి అజ్మీర్‌ లైంగిక కుంభకోణం లాంటిదని అంటున్నారు. 

ఉడిపి : కర్నాటకలోని ఉడిపిలోని ఓ ప్రతిష్టాత్మక మెడికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు  వాష్‌రూమ్‌లో మరో విద్యార్థినిని నగ్నవీడియో తీసినందుకు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన అమ్మాయిలు.. అలిమతుల్ షైఫా, షబానాజ్, అలియాలు. 

అయితే ఇప్పుడు దీనిమీద తీవ్ర దుమారం రేగుతోంది. వీరు తమ తోటి విద్యార్థులు వాష్ రూంలో ఉండగా రికార్డ్ చేయడానికి వీడియో కెమెరాలను అమర్చారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చినప్పుడు..  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇతర విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆప్టోమెట్రీ ఇన్‌స్టిట్యూట్ ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రకారం,  కాలేజీలోకి సెల్ ఫోన్లు తెచ్చినందుకు.. రహస్యంగా వీడియో తీసినందుకు రెండు నేరాల కింద వీరిని సస్పెండ్ చేశారు.  

కాలేజీ బాత్రూంలో తోటి విద్యార్థిని వీడియో తీసిన ముగ్గురమ్మాయిలు, సస్పెండ్ చేసిన యాజమాన్యం...

అయితే, ఈ కేసు ఓపెన్ అండ్ షట్ కేసుగా కనిపించడంతో సోషల్ మీడియాలో దీనిమీద తీవ్ర చర్చ జరుగుతోంది. నెటిజన్లు ఈ కేసును 1992 నాటి అజ్మీర్ లైంగిక కుంభకోణానికి లింక్ చేస్తున్నారు. ఇది కూడా అలాంటి కేసే అని మండిపడుతున్నారు. అజ్మీర్ కేసులో వందలాది మంది స్కూలు, కాలేజీ బాలికలు వారి నగ్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ కి గురయ్యారు. మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులు వీరిమీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మానవ హక్కుల కార్యకర్త రష్మీ సమంత్ ఉడిపి ఘటనను అజ్మీర్ ఘటనతో ముడిపెట్టారు. వరుస ట్వీట్లలో, నగ్న ఛాయాచిత్రాలతో బ్లాక్ మెయిల్ చేయబడిన అమ్మాయిలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆమె ఆరోపించింది. ఆ సమయంలో జరిగింది వివరిస్తూ... అటువంటి వీడియోలు లేదా ఫోటోలు కమ్యూనిటీ వాట్సాప్ గ్రూపులలో నేరస్థులకు పంపబడ్డాయని సమంత్ ఆరోపించారు. 

ఇప్పుడు వెలుగు చూసిన ఘటన కూడా అలాంటిదేనని కాకపోతే ఈ సమస్యను ఖండించడం లేదా "తీసుకోవాల్సినంత తీవ్రతతో" చూడడం లేదని ఆమె అన్నారు. ఉడిపి ఘటనను అజ్మీర్ సెక్స్ స్కాండల్‌తో లింక్ చేస్తూ, మరొకరు దీనిని 'అజ్మీర్ 1992 పార్ట్ 2' అని పేర్కొన్నారు. ఇంకొకరు ఈ ఘటనను 'ఉడిపి ఫైల్స్' అంటూ కామెంట్ చేశారు. 

1992 అజ్మీర్ సెక్స్ స్కాండల్ అంటే ఏమిటి?
90వ దశకంలో దేశాన్ని కుదిపేసిన అత్యంత భయంకరమైన లైంగిక కుంభకోణాలలో ఒకటి, 1992లో వెలుగులోకి వచ్చిన అజ్మీర్ కుంభకోణం, పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న వందలాది మంది బాలికలపై క్రమబద్ధమైన బ్లాక్‌మెయిల్, సామూహిక అత్యాచారం జరిగింది. అప్పటి నివేదికల ప్రకారం ఇది కొన్ని సంవత్సరాలలో జరిగింది.

నేరస్థులు సన్నిహిత క్షణాలను రికార్డ్ చేయడం లేదా నగ్న ఛాయాచిత్రాలను పోస్ట్ చేయడం ద్వారా బాధితులను బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ అశ్లీల ఫోటోలు లేదా వీడియోలు స్థానిక గ్యాంగ్‌లకు ఫార్వార్డ్ చేయబడతాయి, ఎక్కువగా మైనారిటీ కమ్యూనిటీకి చెందినవి, వారు అమ్మాయిలను లైంగికంగా దోపిడీ చేస్తారు.

అజ్మీర్ షరీఫ్ దర్గాతో సంబంధాలున్న వ్యక్తి ఒక అమ్మాయితో స్నేహం చేసి ఆమెను ఉచ్చులోకి నెట్టడంతో కుంభకోణం మొదలైంది. వందలాది మంది పాఠశాల, కళాశాలలకు వెళ్లే బాలికలను దోపిడీ చేయడం ఆ సమయంలో తీవ్ర సంచలనంగా మారింది. 

స్థానిక వార్తాపత్రికలో బాలికల కొన్ని అశ్లీల ఛాయాచిత్రాలతో స్థానిక ముఠాలు వారిని లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఒక వార్త ప్రచురించడంతో ఈ స్కాండల్ వెలుగు చూసింది. 

 

Scroll to load tweet…