నాలుగు సంవత్సరాల వయసున్న ఓ అశ్వం ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 61 అశ్విక దళానికి చెందిన రియో 18వ సారి రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొని చరిత్ర సృష్టించనుంది.
నాలుగు సంవత్సరాల వయసున్న ఓ అశ్వం ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 61 అశ్విక దళానికి చెందిన రియో 18వ సారి రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొని చరిత్ర సృష్టించనుంది.
61వ అశ్వికదళం ప్రపంచంలోనే చురుకైన సేవలందించే అశ్విక దళ రెజిమెంట్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు, 61వ రెజిమెంట్లోని గుర్రాలు 20 దాటితే పదవీ విరమణ చేయడం తప్పనిసరి. కానీ 22 ఏళ్ళ వయసులో కూడా రియో ఇప్పటికీ చురుకుగా ఉండటం గమనార్హం.
కెమెరా ఫ్లాష్లైట్లు, ఇతరత్రా శబ్దాలు ఉన్నప్పుడు జంతువులు పరేడ్ గుండా వెళ్ళడం చాలా కష్టం . కాని ఈ గుర్రాలు నిర్భయంగా కదులుతాయి. ఎలాంటి క్లిష్ట పరిస్ధితుల్లోనూ రియో తన దృష్టి మరల్చదు.
61వ అశ్వికదళ బృందానికి నాయకత్వం వహిస్తున్న కెప్టెన్ దీపాన్షు షియోరన్ ఏషియానెట్ న్యూస్తో మాట్లాడుతూ.. రియో తనకు ఇచ్చిన ఆదేశాన్ని గౌరవిస్తుందని.. తాను ఏ ఆదేశం ఇచ్చినా వేగంగా కదులుతుందన్నారు.
పదవీ విరమణ చేసిన తర్వాత గుర్రాలను ఉత్తరాఖండ్లోని హేంపూర్లోని రీమౌంట్ ట్రైనింగ్ స్కూల్లో ఉంచుతారు. అయితే రియో విషయంలో మాత్రం అది చనిపోయే వరకు డ్యూటీలోనే వుంటుందని అధికారులు తెలిపారు.
ఆరు రాష్ట్ర దళాల సమ్మేళనంతో 1953 ఆగస్టు 1న ఆ రెజిమెంట్ ఏర్పాటైంది. ఇది ఇప్పటి వరకు 39 బ్యాటిల్ హానర్స్ను గెలుచుకుంది. వీటిలో ఈక్వెస్ట్రియన్, పోలో, ఒక పద్మశ్రీ , ఒక సర్వోత్తం జీవన్ రక్షా పడక్, 12 అర్జున అవార్డులు, ఆరు విశిష్ట సేవా పతకాలు, 53 చీఫ్ ఆర్మీ స్టాప్ ప్రశంసలు, ఒక చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ప్రశంసలు, రెండు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ ప్రశంసలు, ఎనిమిది వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ప్రశంసలు, ఎనిమిది చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రశంసలు, 180 జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసలు పొందాయని కెప్టెన్ షిరన్ అన్నారు.
రిపబ్లిక్ డే పరేడ్తో పాటు ఆర్మీ డే పరేడ్ షో ఓపెనర్గా ఈ అశ్వికదళం వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్లో హైఫా యుద్ధంలో రెజిమెంట్ కూడా పాల్గొంది. 1918 లో హైఫాను విముక్తి చేయడానికి సహాయపడిన మైసూర్, జోధ్పూర్ భారత అశ్వికదళ రెజిమెంట్లకు నివాళి అర్పించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23 న హైఫా డే జరుపుకుంటారు. ఈ సమయంలో టర్కిష్, జర్మన్ మరియు ఆస్ట్రియన్ దళాల సమిష్టి మరియు పెద్ద శక్తిని ఓడించారు.
1965 ఇండో-పాక్ యుద్ధంలో, 61 వ అశ్వికదళాన్ని రాజస్థాన్ లోని గంగానగర్ సెక్టార్లో మోహరించారు. ఈ ప్రాంతం దాదాపు వంద కిలోమీటర్లు. ఆ సమయంలో ఎలాంటి చొరబాటు కేసులు నమోదు కాలేదని రికార్డులు చెబుతున్నాయి. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఈ రెజిమెంట్ రాష్ట్రపతి భవన్కు రక్షణ కల్పించింది.
అంతేకాకుండా 1989లో ఆపరేషన్ పవన్, 1990 లో ఆపరేషన్ రక్షక్, 1999లో ఆపరేషన్ విజయ్, 2001-2002లో ఆపరేషన్ పరాక్రం సమయంలో దేశానికి అసాధారణమైన సేవలను అందించింది. ఈ రెజిమెంట్ నినాదం 'అశ్వశక్తి యశోబల్' అంటే 'గుర్రపు శక్తి ఎప్పటికీ సుప్రీం'.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 24, 2021, 11:13 PM IST