జాక్ పాట్ అంటే ఇదే.. రూ.100తో లాటరీ టికెట్ కొని.. రూ.కోటిన్నర గెలుచుకున్న స్నేహితులు.. (వీడియో)
పంజాబ్ కు చెందిన ఇద్దరు స్నేహితులను అదృష్టం వరించింది. వారిద్దరూ కలిసి రూ.100తో కొన్న లాటరీ టికెట్ కు రూ.కోటిన్నర ప్రైజ్ మనీ లభించింది. ఎన్నో ఏళ్ల నుంచి వారిద్దరూ ఇలా కలిసి లాటరీలు కొంటున్నారు. అయితే వారు ఈ సారి జాక్ పాట్ కొట్టారు.
ఇద్దరు స్నేహితులు జాక్ పాట్ కొట్టారు. రూ.100తో ఇద్దరూ కలిసి లాటరీ టిక్కెట్ కొన్నారు. ఆ టికెట్ కు రూ.కోటిన్నర ప్రైజ్ మనీ దక్కింది. దీంతో వారిద్దరూ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఒకే రోజు కోటీశ్వరులైపోయిన రమేశ్, కుకీ అనే స్నేహితులిద్దరిది పంజాబ్ లోని ఫాజిల్కా జిల్లాలోని అబోహర్ పట్టణం. వీరి మధ్య చాలా ఏళ్ల నుంచి స్నేహం కొనసాగుతోంది.
ఈ ఇద్దరు స్నేహితులు కలిసి గత కొన్నేళ్లుగా అనేక సార్లు లాటరీ టిక్కెట్లు కొన్నారు. వీరిద్దరికీ ఆయా లాటరీల్లో చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు కూడా వచ్చేవి. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి ఇటీవల రూ.100తో ఓ లాటరీ టికెట్ ను కొన్నారు. ఆ లాటరీకి సంబంధించిన ఫలితాలు ఆదివారం రాత్రి విడుదల అయ్యాయి. అందులో వీరు కొన్న టిటెక్ కు రూ.కోటిన్నర ప్రైజ్ మనీ వచ్చినట్టు తెలిసింది.
సహజీవనం చేసిన యువకుడిపై మహిళ యాసిడ్ దాడి.. గుంటూరులో ఘటన.. ఏం జరిగిందంటే ?
దీంతో రమేశ్, కుకీ ఎంతో సంతోషించారు. సోమవారం రోజు లాటరీ టికెట్ అమ్మిన ప్రాంతానికి వారిద్దరూ బ్యాండుమేళం తీసుకొని, డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు. అందరికీ స్వీట్లు తినిపించారు. ఆ లాటరీ టికెట్ ను కలర్ జిరాక్స్ చేయించి, దానిని అందరికీ చూపించారు. అయితే ప్రైజ్ మనీ ద్వారా వచ్చిన డబ్బును తమ పిల్లలకు ఇస్తామని ఇద్దరు స్నేహితులు వెల్లడించారు. మరి కొంత డబ్బును అధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ఆనందంతో చెప్పారు