తమిళనాడులో దారుణం.. భార్య అనుకొని నిద్రిస్తున్న మరో మహిళను..
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఫుత్ పాత్ పై నిద్రిస్తున్న మహిళ తన భార్య అనుకొని ఓ భర్త వేరే మహిళను హత్య చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.
వారి ఇద్దరికీ ఇది రెండో పెళ్లి.. పెళ్లి జరిగిన నాటి నుంచి కొన్ని నెలల పాటు కాపురం చక్కగానే సాగింది. అయితే కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తరచూ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అతడి మీద కోపంతో భార్య తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆగ్రహించిన భర్త ఆమెను చంపేందుకు ఆ గ్రామానికి వెళ్లాడు. అయితే అక్కడ నిద్రిస్తున్న క్రమంలో వేరే మహిళను హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా ఇందిరానగర్ లో ఓ పశువుల వ్యాపారి నివసిస్తున్నాడు. అతడి పేరు దేవేంద్రన్. కొంత కాలం కిందట అతడి భార్య మృతి చెందింది. దీంతో అదే గ్రామానికి చెందిన భర్త చనిపోయిన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు ధనలక్ష్మి. వీరికి ఐదు నెలల కిందట పెద్దలు పెళ్లి జరిపించారు. కొన్ని రోజుల తరువాత ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగేవి. దీంతో భార్య భర్తపై కోపంతో దగ్గరలో ఉన్న ఆంబూరులోని బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేది.
పోలీసు కస్టడీలో వ్యక్తి మరణించాడనే ఆగ్రహంతో స్టేషన్ కు నిప్పు.. అస్సాంలో ఘటన
ఈ క్రమంలో వారం రోజుల కిందట కూడా దంపతుల ఇద్దరికీ గొడవ జరగడంతో ఆమె ఆంబూరుకు వచ్చింది. ఆమె కౌసర్ అనే మహిళ దగ్గర ఉంటోంది. ఆమె భర్త ఓ చోరీ కేసులో అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం అతడు అయ్యి వేలూర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ధనలక్ష్మీ కౌసర్ అనే మహిళతో ఆంబూరు దగ్గరలో ఉన్న ఓ పుత్ పాత్ పై నిద్రపోతోందని భర్త దేవేంద్రన్ కు తెలిసింది. తన భార్యను హత్య చేయాలనుకొని ఆ పట్టణానికి అతడు చేరుకున్నాడు.
శుక్రవారం రాత్రి సమయంలో కౌసర్, ఆమె అత్త అయిన పర్వీన్, కౌసర్ ఇద్దరు పిల్లలు కలిసి ఆ ఫుత్ పాత్ పై పడుకున్నాడు. అయితే నిద్రపోతున్న సమయంలో అందరూ బురకా ధరించారు. వారి వద్దకు వచ్చిన దేవేంద్రన్ కు తన భార్య ఎవరో అర్థం కాలేదు. కానీ ఓ మహిళనే తన భార్య అని నిర్ధారించుకొని వెనకాల నుంచి వెళ్లి కత్తితో పొడిచి చంపేశాడు. కానీ అతడు చంపింది తన భార్యను కాదు మరో మహిళను అని తెలసుకోవడానికి దేవేంద్రన్ కు ఎక్కువ సమయమేమీ పట్టలేదు. ఈ హత్య జరిగిన సమయంలో అలజడి కావడంతో ధనలక్ష్మి నిద్రలో నుంచి లేచింది. ఈ ఘటన చూసి షాక్ గురయ్యింది. వెంటనే కేకలు వేయడం ప్రారంభించింది.
దీంతో అతడు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ధనలక్ష్మి పై కూడా కత్తితో దాడి చేశాడు. ఆమె అరుపులు వినిపించడంతో స్థానికంగా నిద్రిస్తున్నవారందరూ లేచారు. ఈ దాడిని అడ్డుకున్నాడు. దేవేంద్రన్ నుంచి కత్తి లాక్కొని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆంబూరు పోలీసులు అక్కడికి చేరుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.