ఆస్తి కోసం.. తండ్రి, ఇద్దరు చెల్లెళ్లను క్రూరంగా నరికి చంపిన దుర్మార్గుడు
Uttar Pradesh: ఆస్తి తగాదాల కారణంగా తండ్రి, ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఓ వ్యక్తి కత్తితో అతిక్రూరంగా దాడి చేసి చంపాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
Uttar Pradesh crime: ఆస్తి తగాదాల కారణంగా తండ్రి, ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఓ వ్యక్తి కత్తితో అతిక్రూరంగా దాడి చేసి చంపాడు. నిద్రిస్తున్న సమయంలో సొంతవారిపై దాడి చేసి ప్రాణాలు తీసిన ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్ లో ఆస్తి తగాదాల కారణంగా తండ్రి, ఇద్దరు సోదరీమణులను ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. తమ ఇంట్లో నిద్రిస్తున్న 26 ఏళ్ల వ్యక్తి తన 60 ఏళ్ల తండ్రి, 24, 17 ఏళ్ల ఇద్దరు చెల్లెళ్లను పదునైన వస్తువుతో పదేపదే పొడుస్తూ.. అతిక్రూరంగా దాడిచేసి ప్రాణాలు తీశారు. ఆస్తి తగాదాల కారణంగా ఆ దుర్మార్గుడు ఈ దారుణానికి ఒడికట్టాడని ప్రాథమిక సమాచారం అందిందని జిల్లా పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలు సోమవారం తెల్లవారుజామున బరౌత్ నగర్లోని పట్టి చౌదరన్ ప్రాంతంలో జరిగాయి. నిందితుడిని అమర్సింగ్గా గుర్తించారు. మృతులను బ్రిజ్పాల్ తోమర్, అతని కుమార్తెలు జ్యోతి, అనురాధగా గుర్తించారు. బ్రిజ్పాల్ రైతు కాగా, అతని ఏకైక కుమారుడు అమర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్థానిక ఇసుక మైనింగ్ ప్రాజెక్టులతో సంబంధం కలిగి ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.
బరౌత్ సర్కిల్ ఆఫీసర్ (CO) యువరాజ్ సింగ్, అతని బృందంతో కలిసి ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశారు, "అమర్ సింగ్ అకా లక్ష్యపై అతని తల్లి శశిప్రభ ఫిర్యాదు మేరకు IPC సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేయబడింది. అమర్ కత్తితో పొడిచాడు. అతని ఇద్దరు సోదరీమణులు తమ తండ్రిని రక్షించడానికి ప్రయత్నించిన తర్వాత, అతను తన భర్తను రక్షించడానికి తన తల్లి మెట్ల మీదికి వచ్చినప్పుడు కూడా అతను దాడికి ప్రయత్నించాడు. నేరం చేసిన తర్వాత, అమర్ పారిపోయాడు, కానీ తరువాత రోజు పట్టుపడ్డాడు" అని పోలీసులు తెలిపారు. రెండు నెలల క్రితం తన తండ్రి తనను విడిచిపెట్టినందుకు తాను కలత చెందానని విచారణలో నిందితుడు పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు. తనను దూరుం చేస్తున్నందుకే ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పినట్టు సమాచారం.
ఇదిలావుండగా, మహౄరాష్ట్రలోని థానేలో షాకింగ్ ఘటన జరిగింది. థానేలోని ముంబ్రాకు చెందిన 23 ఏళ్ల యువకుడు తన మాజీ ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. ఈ సమయంలో ఆమె pregnant. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలు ముస్కాన్ అలియాస్ నదియా ముల్లాగా, నిందితుడిని ఓ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న అల్తమాష్ దల్వీగా గుర్తించారు. అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ కృపాలి బోర్సే తెలిపిన వివరాల ప్రకారం... శనివారం మధ్యాహ్నం 3-5.30 గంటల మధ్య విరాని ఎస్టేట్ లో ఈ ఘటన జరిగింది. నిందితుడు పదునైన ఆయుధంతో ముల్లా గొంతు కోశాడు.