Asianet News TeluguAsianet News Telugu

హీరోయిన్ కంగనా రనౌత్ పై కేసు...

ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. కంగనా గత ఏడాది ముంబయిలోని పాలీహిల్‌లో రూ.20.07 కోట్లతో ఓ ఇల్లు కొన్నారు. అయితే ఆ ఇంటి కొనుగోలు సమయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రకాష్ జీ రోహిర అనే వ్యక్తికి చెల్లించాల్సిన సొమ్ములు చెల్లించలేదని ఆరోపించాడు. 

The case against heroine Kangana Ranaut
Author
Mumbai, First Published Aug 19, 2018, 6:18 PM IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌పై కేసు నమోదైంది. కంగనా గత ఏడాది ముంబయిలోని పాలీహిల్‌లో రూ.20.07 కోట్లతో ఓ ఇల్లు కొన్నారు. అయితే ఆ ఇంటి కొనుగోలు సమయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ప్రకాష్ జీ రోహిర అనే వ్యక్తికి చెల్లించాల్సిన సొమ్ములు చెల్లించలేదని ఆరోపించాడు. తనకు పడ్డ బాకీ చెల్లించలేదంటూ కంగనా, ఆమె సోదరి రంగోలిపై ముంబయిలోని ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

అయితే ఒప్పందం ప్రకారం ఒక శాతం అంటే 20 లక్షల రూపాయలు అడిగారని అది ఇచ్చామని కానీ ఇప్పుడు 2 శాతం డిమాండ్ చేస్తున్నారని కంగనా ప్రతినిధులు చెప్తున్నారు. ఒప్పందం, నగదు చెల్లింపులకు సంబంధించి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. 

కంగనా ప్రస్తుతం మణికర్ణిక అనే చిత్రంలో నటిస్తున్నారు. క్రిష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..... విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించారు. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. ఆగస్టు 15న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios