Jabalpur: ఇస్లామిక్ సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ అణిచివేతలో భాగంగా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఇస్లామిక్ సంస్థ హిజ్బుల్-ఉత్-తహ్రీర్ పై అర్ధరాత్రి ఎన్ఐఏ దాడులు ప్రారంభించింది. జబల్ పూర్ లో 13 చోట్ల సోదాలు నిర్వహించింది. ఉగ్రవాద కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది.
NIA raids on terror conspiracy case: దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రకుట్రలు, సంబంధిత కార్యకలాపాలు పెరుగుతుండటంపై జాతీయ దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచుతున్నాయి. ఉగ్రకుట్రలు, దాడులను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఉగ్రవాద కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ హిజ్బ్-ఉత్-తహ్రీర్ కు చెందిన భోపాల్-హైదరాబాద్ మాడ్యూల్ పై దర్యాప్తు సంస్థ అర్థరాత్రి ఈ దాడులను ప్రారంభించింది.
ఈ నెల ప్రారంభంలో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) కేంద్ర నిఘా సంస్థలతో కలిసి సంయుక్త ఆపరేషన్ లో హిజ్బుల్-ఉత్-తహ్రీర్ (హెచ్యుటీ) తో సంబంధం ఉన్న సుమారు 16 మంది యువకులను అదుపులోకి తీసుకుంది. ఉగ్రదాడులకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో నిందితులను ఎంపీ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జబల్ పూర్, భోపాల్ లలో అరెస్టయిన హిజ్బుల్-ఉత్-తహ్రీర్ సభ్యులకు అంతర్జాతీయ సంబంధాలు ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నగదు, రెచ్చగొట్టే సాహిత్యం, ఎలక్ట్రానిక్ పరికరాలు, డజనుకు పైగా సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పట్టుబడిన హిజ్బుల్ తహ్రీర్ కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారికంగా చేపట్టింది.
హిజ్బ్-ఉత్-తహ్రీర్ (హెచ్యూటీ) అనే రాడికల్ సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానంతో అరెస్టయిన నిందితులు లవ్ జిహాద్, మత మార్పిడులకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలిందని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఇటీవల చెప్పారు. "ఆశ్చర్యకరంగా, బ్రెయిన్ వాష్ కు పాల్పడిన వ్యక్తులు సాధారణ వ్యక్తులు కాదు. వారిలో ఒకరు ప్రొఫెసర్, మరొకరు జిమ్ ట్రైనర్, మూడో వ్యక్తి కోచింగ్ క్లాసు నడుపుతున్నారు. వీరిలో ఒకరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా మరొకరు సాఫ్ట్ వేర్ టెక్నీషియన్. ఇలాంటి వారు లవ్ జిహాద్ కు పాల్పడుతున్నారు. హిందూ అమ్మాయిలను బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేసుకుంటారు. మొదట హిందూ వ్యక్తులు ఇస్లాం మతంలోకి మారతారనీ, ఆ తర్వాత ఈ అమ్మాయిలను కూడా మతం మారుస్తున్నారని" మంత్రి తెలిపారు.
అరెస్టయిన నిందితుల్లో ముగ్గురు ఇతర మతాలకు చెందిన అమ్మాయిలను వివాహం చేసుకుని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని మధ్యప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడైంది.