తనపై ఓ మహిళ అత్యాచారానికి పాల్పడిందంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో గత మార్చిలో రోహిత్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు.
తనపై ఓ మహిళ అత్యాచారానికి పాల్పడిందంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీకి చెందిన బాధితురాలు ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలో గత మార్చిలో రోహిత్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు.
అతడు పెట్టుబడి పెడతానని ఆశ చూపి.. స్నేహితుడు రాహుల్తో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు. ఆ దారుణాన్ని వీడియో తీసి బెదిరింపులకు గురిచేసి.. ఆమెతో ఓ ఇంట్లో వ్యభిచారం చేయించాడు.
నాటి నుంచి అక్కడే బందీగా ఉంటున్న ఆ యువతిపై 19 ఏళ్ల యువతి సెక్స్టాయ్స్తో ఘోరానికి పాల్పడేదని.. వినకపోతే తీవ్రంగా కొట్టేదని బాధితురాలు ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. స్వలింగ సంపర్కం నేకం కాదంటూ 377 సెక్షన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులు ఆమెను ఎదురు ప్రశ్నించారు.
ఈ ఘటనకు సంబంధించి రోహిత్, రాహుల్తో పాటు సాగర్ అనే మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.. అయితే అత్యాచారానికి పాల్పడిందని చెబుతున్న సదరు యువతిపై మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.. దీంతో బాధితురాలు మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసింది.
