37యేళ్ల వ్యక్తితో 15యేళ్ల బాలిక ప్రేమ, పెళ్లి వద్దన్నారని సుత్తి, కుక్కర్ లతో కొట్టి.. తల్లిదండ్రుల దారుణ హత్య
తనకంటే 22యేళ్లు పెద్దవాడైన వ్యక్తి ప్రేమలో పడి.. తల్లిదండ్రులనే కాదనుకుంది. అంతేకాదు.. అడ్డొచ్చిన వారిని అతి దారుణంగా హత్య చేసి ప్రియుడితో పరారయ్యింది ఓ కూతురు.
జార్ఖండ్ : అందరూ తల్లిదండ్రుల్లాగే.. ఆ తల్లిదండ్రులూ కూతుర్ని అల్లారుముద్దుగా పెంచారు. అడిగిందల్లా కొనిచ్చారు. అపురూపంగా చూసుకున్నారు. తమ ప్రేమ ప్రతి రూపాన్ని గారాబంగా చూసుకుంటూ.. ఆమె అందమైన భవిష్యత్తు కోసం కలలు కన్నారు. కానీ ఆ కూతురు మాత్రం వారి పాలిట శాపంగా మారింది. ప్రేమించిన వాడి కోసం.. కనీపెంచిన తల్లిదండ్రులను దారుణంగా హతమార్చింది. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని జంషెడ్పూర్ లో కలకలం రేపింది. ఓ అమ్మాయి తన 30ఏళ్ల ప్రియుడితో కలిసి తన తల్లిదండ్రులను ఘోరంగా చంపినట్లు పోలీసులు తెలిపారు.
బాలిక, ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి వెడుతుండగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో వారిద్దరూ కలిసి.. సుత్తి, ప్రెషర్ కుక్కర్ లతో మోది హత్య చేసినట్లు జంషెడ్పూర్ పోలీసులు మంగళవారం తెలిపారు. జార్ఖండ్లోని తూర్పు సింగ్ భూమ్ జిల్లా తెలుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని మేనిఫెస్టోలో ఈ ఘటన సోమవారం జరిగింది. ఇంట్లో సోమవారం రక్తపుమడుగులో దంపతులు పడి ఉండటాన్నిచూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న దంపతులిద్దరూ తమ 15 ఏళ్ల కుమార్తె కనిపించకుండా పోయినట్లు చివరిసారిగా మాట్లాడినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో కరోనా కలకలం.. మరోసారి ప్రియాంకకు పాజిటివ్.. మూడు నెలల్లో రెండో సారి..
దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓం నగర్ లో బాలిక, ఆమె ప్రియుడుని పట్టుకున్నట్టు పోలీసులు సూపరింటెండెంట్ కె విజయ్ శంకర్ తెలిపారు. బాలిక ఆదివారం తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇంట్లో నుంచి పారిపోతుండగా ఆమె తల్లిదండ్రులు అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి (42), తల్లి (35) వారిని వెళ్లకుండా ఆపడంతో నిందితులిద్దరూ సుత్తి ప్రెషర్ కుక్కర్ ల తో కొట్టి చంపారని అధికారి తెలిపారు ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి స్కూటర్ మీద పారిపోయింది. సుత్తి, రక్తంతో తడిసిన ప్రెషర్ కుక్కర్, స్కూటర్ లను లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సెక్షన్ 32 తో సహా ఐపీసీ లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.