Asianet News TeluguAsianet News Telugu

అభినందన్‌కు పరమ వీర చక్ర ఇవ్వాలి: తమిళనాడు సీఎం

పాకిస్తాన్ ఆర్మీకి బందీగా చిక్కి ఇండియాకు తిరిగొచ్చిన భారత వింగ్ కమాండర్ అభినందన్‌కు పరమ వీర్ చక్ర ఇవ్వాలని తమిళనాడు సీఎం పళనిస్వామి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
 

tamilnadu cm palaniswami demands param vir chakra for abhinandhan
Author
Tamil Nadu, First Published Mar 8, 2019, 6:19 PM IST


చెన్నై:పాకిస్తాన్ ఆర్మీకి బందీగా చిక్కి ఇండియాకు తిరిగొచ్చిన భారత వింగ్ కమాండర్ అభినందన్‌కు పరమ వీర్ చక్ర ఇవ్వాలని తమిళనాడు సీఎం పళనిస్వామి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం పళనిస్వామి శుక్రవారం నాడు ఓ లేఖ రాశారు. అభినందన్ కు పరమ్ వీర్ చక్ర ఇవ్వాలని ఆ లేఖలో మోడీని పళనిస్వామి కోరారు.తన ప్రతిపాదనపై ప్రధానమంత్రి సానుకూలంగా స్పందిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మిగ్-21 యుద్ధ విమానం పాక్ విమానాన్ని వెంటాడుతూ కుప్పకూలింది. ఈ విమానం నుండి పైలట్ అభినందన్ సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డాడు. రెండు రోజుల తర్వాత అభినందన్ స్వదేశానికి తిరిగి వచ్చారు. 

తమిళనాడు రాష్ట్రంలో అన్నాడిఎంకె, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. ఈ తరుణంలో  అభినందన్ కు పరమ్ వీర్ చక్ర  అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఈ కూటమికి కలిసొచ్చే అవకాశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios