త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే  తమ పార్టీ పోటీ చేస్తోందని ఆయన తేల్చి చెప్పారు.  


చెన్నై: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే తమ పార్టీ పోటీ చేస్తోందని ఆయన తేల్చి చెప్పారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ విషయమై రజనీకాంత్ ఆదివారం నాడు స్పష్టత ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్యంగానే తమ పార్టీ పోటీ చేస్తోందని రజనీకాంత్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీకి కూడ మద్దతును ఇవ్వదన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ, అభ్యర్థులు కూడ తన ఫోటోలను, గుర్తులను వాడుకోకూడదని ఆయన కోరారు. ప్రజల సమస్యల్ని తీర్చడంలో ముందుండేవారిని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారిని ఎన్నుకోవాలని రజనీకాంత్ సూచించారు.

ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆదివారం నాడు ప్రకటన విడుదల చేశారు.