Asianet News TeluguAsianet News Telugu

భారీ వర్షాలకు కూలిన గోడ... 17కి చేరిన మృతుల సంఖ్య

బహుళ అంతస్తుల నివాస సముదాయం గోడ కూలి 15మంది మృతి చెందారు. శిథిలా కింద మరికొందరు చిక్కుకొని ఉన్నట్లు తెలుస్తోంది.  పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.

Tamil Nadu rains: 15 killed as two houses collapse in Coimbatore
Author
Hyderabad, First Published Dec 2, 2019, 9:02 AM IST

తమిళనాడులోని కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో సోమవారం ఉదయం ఘెర ప్రమాదం చోటుచేసుంది. బహుళ అంతస్తుల నివాస సముదాయం గోడ కూలి 17మంది మృతి చెందారు. శిథిలా కింద మరికొందరు చిక్కుకొని ఉన్నట్లు తెలుస్తోంది.  పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.

సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఎంత మంది మృతి చెందారన్నదానిపై అధికారిక సమాచారం లేదు. 

శిథిలా కింద చిక్కుకున్నవారిని బయటకు తీస్తున్నారు. తొలుత 15 మంది చనిపోయినట్లు వార్తలు రాగా... ప్రస్తుతం మృతుల సంఖ్య 17కి చేరింది. గోడకూలి పక్కనే ఉన్న చిన్నఇళ్లపై పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios