ముంబై : దాదర్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పద బ్యాగులు.. రంగంలోకి బాంబ్ స్క్వాడ్
దేశ వాణిజ్య రాజధాని ముంబై శివార్లలోని దాదర్ రైల్వేస్టేషన్లోని టికెట్ కౌంటర్ దగ్గర రెండు బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
దేశ వాణిజ్య రాజధాని ముంబై శివార్లలోని దాదర్ రైల్వేస్టేషన్లో బాంబు కలకలం రేపింది. స్టేషన్లోని టికెట్ కౌంటర్ దగ్గర రెండు బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. నగర పోలీసులతో పాటు రైల్వే పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.