ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది . ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ అరెస్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సిసోడియాకు న్యాయపరంగా ప్రత్యామ్నాయాలు వున్నాయి కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా మనీష్ సిసోడియాకు సుప్రీం సూచించింది.
అంతకుముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ మనీష్ సిసోడియా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. నేరుగా సుప్రీం కోర్టుకు వచ్చే ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దీనిపై అభిషేక్ సింఘ్వి స్పందిస్తూ.. జర్నలిస్ట్ వినోద్ దువా కేసులో సుప్రీంకోర్టు తీర్పును సింఘ్వీ ఉదహరించారు. అదే మనీష్ సిసోడియా నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి కారణమని చెప్పారు. ఈ క్రమంలోనే సీబీఐ అరెస్ట్ను సవాలు చేస్తూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు అనుమతించింది. ఇందుకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3:50 గంటలకు విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ చంద్రచూడ్ తెలిపారు.
Also REad: మోడీ-అదానీ బంధంపై డైవర్షన్ కోసమే సిసోడియా అరెస్ట్: కేసీఆర్
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియాది కీలక పాత్ర అని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నయి. ఈ క్రమంలోనే సిసోడియాను ఫిబ్రవరి 26వ తేదీన మరోసారి విచారించిన సీబీఐ అధికారులు.. ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను సోమవారం సీబీఐ అధికారులు.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆయనను ఐదు రోజుల పాటు రిమాండ్కు ఇవ్వాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా ప్రణాళిక బద్దంగా, రహస్యంగా కుట్ర పొందాని సీబీఐ కోర్టులో వాదనలు వినిపిచింది. ఇందులో మనీష్ సిసోడియాది కీలక పాత్ర అని కూడా తెలిపింది. ఈ కేసులో సమర్థవంతమైన విచారణ కోసం మనీష్ సిసోడియా కస్టడీ అవసరమని వాదించింది. ఈ కేసులో తన పాత్ర ఏమీ లేదని సిసోడియా పేర్కొన్నప్పటికీ.. ఆయన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారని విచారణలో తేలిందని సీబీఐ కోర్టుకు తెలియజేసింది.
