చెన్నైలోని బీచ్స్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. షెడ్ నుంచి వస్తున్న రైలు పట్టాలు తప్పి, పక్కకు ఒరిగిపోయింది. అయితే ఆ సమయంలో రైలులో ప్రయాణీకులెవరూ లేకపోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు.
తమిళనాడు (tamilnadu) రాజధాని చెన్నైలో (chennai) సబర్బన్ రైలు (suburban rail) పట్టాలు తప్పింది. చెన్నైలోని బీచ్ సబర్బన్ రైలు స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. షెడ్ నుంచి బీచ్ స్టేషన్కు వెళ్తున్న రైలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. అదృష్టవశాత్తూ రైలులో ప్రయాణీకులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు , సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాగా.. ఈ నెల 16న Dadar-Puducherry Express ట్రైన్ కి చెందిన మూడు కోచ్లు శుక్రవారం పట్టాలు తప్పాయి. ఇది ముంబైలోని మాతుంగా స్టేషన్ లో జరిగింది. దాదర్-పుదుచ్చేరి ఎక్స్ప్రెస్.. ముంబై CSMT గడగ్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని Central Railway officials సమాచారం అందించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
