24 గంటల న్యూస్ ప్రసారాల యుగంలోనూ ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ తన సత్తా చాటుతోంది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీష్, బంగ్లా, హిందీ భాషల్లోనూ వేగంగా వార్తలు అందిస్తూ డిజిటల్ రంగంలో దూసుకెళ్తోంది. 

భారత మీడియా చరిత్రలోనే వినూత్నంగా ప్రస్థానం మొదలుపెట్టింది ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా , వాస్తవాలను దాచకుండా , రంగులు వేయకుండా ప్రతిక్షణం సమాజ హితానికి కట్టుబడిన ఏషియానెట్ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు. ఈ విజయాన్ని ప్రజలతోనే పంచుకుంటోంది. వార్తను వేగంగా చేరవేస్తూ కోట్లాది మంది అభిమానాన్ని చాటుకుంది ఏషియానెట్. ఈ దిగ్విజయ యాత్రలో ప్రధానమైన ఘట్టాలు , సాధించిన విజయాలు ఎన్నో. 

వార్తలు చెప్పడం కొత్త విషయం కాదు.. వార్తాపత్రికల నుంచి రేడియోల వరకు, టీవీల నుంచి డిజిటల్ మీడియా వరకు . ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రజలకు వార్తలను చెరవేస్తూ వున్నారు. దేశంలో వందలాది న్యూస్ ఛానెల్స్‌, వెబ్‌సైట్స్, న్యూస్ యాప్స్ వున్నాయి. ఒక్కో దానికి ఒక్కో విధానం వుంది. 24 గంటల న్యూస్ ప్రసారాల యుగంలోనూ ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ తన సత్తా చాటుతోంది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీష్, బంగ్లా, హిందీ భాషల్లోనూ వేగంగా వార్తలు అందిస్తూ డిజిటల్ రంగంలో దూసుకెళ్తోంది. 

Also Read: ఏషియానెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానెల్ లింక్

దీనికి తగినట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్ల పెరుగుదలే దీనికి సాక్ష్యం. ప్రస్తుతం ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌ యూట్యూబ్ ఛానెల్స్ సబ్‌స్క్రైబర్లు నానాటికీ పెరుగుతున్నారు. ఏషియానెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కు 186k, ఏషియానెట్ న్యూస్ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కు 209, ఏషియానెట్ న్యూస్ ఏబుల్‌ యూట్యూబ్ ఛానెల్‌కు 101, మలయాళం యూట్యూబ్ ఛానెల్‌కు 8.2 మిలియన్లు, కన్నడ యూట్యూబ్ ఛానెల్‌కు 3.96 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు వున్నారు.