Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి పేరుతో ఇంటర్ విద్యార్థినిపై డిగ్రీ స్టూడెంట్ పలుమార్లు అత్యాచారం .. గర్భవతి కావడంతో బెదిరించి...

ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ విద్యార్థినితో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ బాలిక ఎనిమిది నెలల గర్భవతి అయ్యింది. అయితే బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ఆ విద్యార్తి తిరస్కరించాడు. తరువాత ఆమెను బెదిరించినట్లు తేలింది. దీంతో బాధితురాలు బర్గూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

student arrested for making girl pregnant in the name of marriage in tamilnadu
Author
Hyderabad, First Published Jan 24, 2022, 9:29 AM IST

చెన్నై : కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలో marriage చేసుకుంటానని నమ్మించి బాలికను pregnantని చేసిన ఓ College student పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే.. కృష్ణగిరి జిల్లా పోచంపల్లి సమీపంలోని 17యేళ్ల బాలిక Plus two చదువుతోంది. అదే ప్రాంతంలో పాపనూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ (19) కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ విద్యార్థినితో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆ బాలిక Eight months pregnant అయ్యింది. అయితే బాధితురాలిని వివాహం చేసుకోవడానికి ఆ విద్యార్తి తిరస్కరించాడు. తరువాత ఆమెను బెదిరించినట్లు తేలింది. 

దీంతో బాధితురాలు బర్గూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇన్స్ పెక్టర్ అముద కేసు నమోదు చేసి ప్రవీణ్ కుమార్ ను ఆదివారం pocso act కింద అరెస్టు చేశారు. 

ఇదిలా ఉండగా, mumbaiలో దారుణ ఘటన జరిగింది. womanపై Minor boys సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ముంబై ఈస్ట్రన్ ఉపనగరం గోవండీ ప్రాంతంలో ఓ యువతిపై నలుగురు వ్యక్తులు gang rapeకి తెగబడ్డారు. స్థానిక శివాజీ నగర్ ఏరియాలోని మట్టీరోడ్డులో శనివారం తెల్లవారుఝామున నాలుగున్నర గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అత్యాచారానికి గురైన యువతి ఓ సంస్థలో కేటరర్ గా పని చేస్తోంది. శుక్రవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వస్తుండగా ఆమెతో పనిచేసే ఓ యువకుడు తనతో కొంచెం పని ఉందని.. మాట్లాడాలి అని చెప్పి ఆమెను ఇంటికి వెళ్లకుండా ఆపేశాడు. ఆ తర్వాత ఆమెకు ఏవో మాయమాటలు చెప్పి యువతిని తీసుకెళ్లి ఓ మురికివాడలోని చిన్న గదిలో బంధించాడు.

అనంతరం అతని స్నేహితులకు సమాచారం అందించాడు. అతని ఫోన్ కాల్ తో అక్కడికి చేరుకున్న స్నేహితులతో కలిసి నలుగురు వ్యక్తులు యువతిపై  పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే బాధితురాలు అక్కడినుంచి తప్పించుకుంది. జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అత్యాచారానికి పాల్పడిందంతా మైనర్లే కావడం ఆందోళన కలిగించే విషయం. 

ఇదిలా ఉండగా, ఆదివారం ఛత్తీస్ ఘఢ్ లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఒంట‌రిగా స‌మీపంలోని దేవాల‌యానికి వెళ్లి వ‌స్తున్న బాలిక‌ను కిడ్నాప్ చేసిన దుండ‌గులు.. సామూహిక లైంగికదాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో చోటుచేసుకుంది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. బాధితురాలి త‌ల్లిదండ్రులు ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Bilaspur లో నివాస‌ముంటున్న 13 సంవ‌త్స‌రాల బాలిక ప్ర‌తిరోజు గుడికి వెళ్లి వ‌స్తుండేది. మ‌ద్యం సేవించి జులాయిగా తిరిగే న‌లుగురు వ్య‌క్తులు ఆమెను గ‌మ‌నించ‌సాగారు. ఈ క్ర‌మంలోనే  గురువారం  నాడు గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వ‌స్తున్న బాధిత బాలిక‌ను  వెంబ‌డించి.. ఆ న‌లుగురు నిందితులు కిడ్నాప్ చేశారు. అర‌వ‌కుండ నోరు మూసి.. సమీపంలోని పొలానికి బలవంతంగా తీసుకెళ్ళి సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios