Asianet News TeluguAsianet News Telugu

రాజ్యాంగాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది:  స్టాలిన్ 

రాజ్యాంగాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  అన్నారు. ఉమ్మడి జాబితా పూర్తిగా కేంద్ర జాబితాగా మారుతోందని పేర్కొన్నారు. జిఎస్‌టి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు మళ్లించబడుతున్నాయి.  

Stalin says  Need to review Constitution to make it truly federal,
Author
First Published Oct 2, 2022, 3:27 AM IST

రాజ్యాంగాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. రాజ్యాంగాన్ని పూర్తి సమాఖ్య రూపంగా మార్చాలని అన్నారు. సీపీఐ కేరళ రాష్ట్ర సదస్సులో స్టాలిన్ మాట్లాడుతూ.. బీజేపీని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ఐక్యంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా ప్ర‌శ్నిస్తే.. పెద్దగా ఉపయోగం ఉంద‌నీ, ఐక్యంగా ప్ర‌శ్నించాల‌ని అన్నారు.  కేవలం కొన్ని రాష్ట్రాలు ఐక్యంగా  ఉంటే సరిపోదనీ,  అన్ని రాష్ట్రాలు ఒకే తాటి మీదికి రావాల‌ని ఆకాంక్షించారు. కేంద్రం రాష్ట్రాల‌ హక్కులను కాలరాస్తూ, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నదని మండిపడ్డారు. 

ఫెడరలిజం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై స్టాలిన్ ప్రసంగిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను అమలు చేస్తూ కేంద్రం దశాబ్దాల క్రితం వరుసగా కేరళ మరియు తమిళనాడులో ఎన్నుకోబడిన వామపక్ష, డిఎంకె ప్రభుత్వాలను రద్దు చేసిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని,  ప్రస్తుత పాక్షిక-సమాఖ్య స్థితి నుండి, భారత రాజ్యాంగాన్ని నిజంగా సమాఖ్యగా సవరించే వరకు త‌మ పోరాటం ఆగ‌ద‌నీ, కేంద్రానికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తామ‌ని అన్నారు.

ఉమ్మడి జాబితా పూర్తిగా కేంద్ర జాబితాగా మారుతోందని ఆరోపించారు. జిఎస్‌టి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు మళ్లించబడుతున్నాయనీ, రాష్ట్రాల ఆర్థిక హక్కులు తీసివేయబడ్డాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. NEET వంటి ప్రవేశ పరీక్షలు విద్యా హక్కులను తిరస్కరించాయి. జాతీయ విద్యా విధానం 2020 ఒక ప్రతిబంధక విధానమ‌ని అన్నారు. NEPని త‌న పార్టీ, ప్రభుత్వం వ్యతిరేకిస్తోందనీ,  ఎందుకంటే...  ఇది "కాషాయీకరణ, హిందీ విధింపు విధానం"గా రూపొందించబడిందని, కానీ రాష్ట్రాలు తమ విధానాలకు అనుగుణంగా విద్యావకాశాలను అందించాల‌ని అన్నారు.
  
మన రాజ్యాంగాన్ని నిజంగా సమాఖ్యగా మార్చడానికి సమీక్ష & పునర్విమర్శ చేయాలనే డిమాండ్ మరింత ముఖ్యమైనద‌నీ, ప్రగతిశీల శక్తులు ఏకతాటిపై నిలబడి అఖిల భారత శక్తిగా మారితేనే మన ఉన్నత లక్ష్యాలను సాధించగలమ‌ని అన్నారు. "ఒక దేశం-ఒకే ఎన్నికలు" వంటి ప్రతిపాదనలపై బిజెపి నేతృత్వంలోని కేంద్రంలో కుండబద్దలు కొట్టిన ఆయన ఏకరూపత ఐక్యత కాదని అన్నారు. ఇటువంటి నిరంకుశ ధోరణికి సమాధానం రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి మరియు బలమైన సమాఖ్య నిర్మాణం అని ఆయన అన్నారు. 

తమిళనాడులో డిఎంకె పాలనపై బిజెపి తమిళనాడు యూనిట్ అనేక సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తోందని గుర్తుంచుకోవాలి. బీజేపీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను విభజించడానికే పుట్టిందని డీఎంకే చీఫ్ ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లో ఇలాంటి ఉద్దేశం చాలాసార్లు ఓడిపోయిందని.. భవిష్యత్తులో కూడా ఓడిపోతుందని అన్నారు.  మతతత్వ, కులతత్వ, నిరంకుశత్వాన్ని సృష్టించే ప్రయత్నంలో బిజెపి విజయం సాధించదనీ, భారత ప్రజలు ఐక్యంగా ఉండి వారిని వ్యతిరేకిస్తారని అన్నారు. ఈ కార్యక్ర‌మంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ అగ్రనేత డి రాజా, వామపక్షాల నేతలు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios