New Delhi: కేరళలో రుతుపవనాల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఆలస్యంగా ఆగమనం చేసిన రుతుపవనాలు శనివారం నాటికి తమిళనాడు, కర్ణాటకకు చేరుకోనున్నాయనీ, దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మరో రెండు రోజుల్లో రెండు రాష్ట్రాలకు మొత్తం విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది.
Southwest monsoon: ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. ఇదే సమయంలో అరేబియా సముద్రంలో కొనసాగుతున్న బిపర్జోయ్ తుఫాను సైతం రుతుపవనాల పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఎండలతో మండిపోతున్నాయి. ఎల్ నినో అంచనాల మధ్య ఈ ఏడాది దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు లేదా తక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి.
వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం కేరళలో రుతుపవనాల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఆలస్యంగా రుతుపవనాలు శనివారం నాటికి తమిళనాడు, కర్ణాటకకు చేరుకోనున్నాయనీ, దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మరో రెండు రోజుల్లో రెండు రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం దక్షిణాది నుంచి పురోగమిస్తూ జూన్ 10 నాటికి రుతుపవనాలు మహారాష్ట్రకు చేరుకుంటాయి. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి బీహార్ వైపు వెళుతుంది. జూన్ 15 నాటికి, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మొత్తం బీహార్లో వర్షాలు ప్రారంభమవుతాయి.
నైరుతి రుతుపవనాలు వారం రోజులుగా ఆలస్యమవుతున్న నేపథ్యంలో.. కేరళ ఛత్తీస్ గఢ్ లోని తీరం రుతుపవనాల రాకకు 12 నుంచి 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆలస్యంగా ప్రారంభం కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రుతుపవనాలపై ఆధారపడిన రైతులు ఇప్పటివకే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రుతుపవనాలు వచ్చాక సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనీ, ప్రభావిత ప్రాంతాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రుతుపవనాలు జూన్ 22న దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి ముఖ్యంగా బస్తర్ డివిజన్ నుంచి ఛత్తీస్ గఢ్ లోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1న భారత్ లోకి ప్రవేశించే రుతుపవనాలు జూన్ 8 నుంచి 16 మధ్య బస్తర్ మీదుగా ఛత్తీస్ గఢ్ కు చేరుకుంటాయని, కేరళలో ప్రవేశించడంలో ఎనిమిది రోజులు ఆలస్యమైందని రాష్ట్ర వాతావరణ నిపుణుడు హెచ్ పీ చంద్ర తెలిపారు.
రుతుపవనాలు జూన్ 24 నాటికి రాజధాని నగరానికి ప్రవేశించే అవకాశం ఉందనీ, ఇది రాష్ట్రంలోకి ప్రవేశించడానికి, రాయ్ పూర్ కు రావడానికి మధ్య రెండు రోజుల వ్యవధి ఉంటుందనీ, రాబోయే రోజుల్లో ఛత్తీస్ గఢ్ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ జల్లులను ప్రీ మాన్ సూన్ పీరియడ్ లో భాగంగా పరిగణించాలన్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను వల్ల దిగువ స్థాయిలో స్వల్పంగా తేమ పేరుకుపోతోంది. ఫలితంగా శుక్రవారం రాష్ట్రంలో తేలికపాటి మేఘాలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలోని కొన్ని దక్షిణ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ, శనివారం మొత్తంగా చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇదిలావుండగా, దక్షిణ భారతంలోని చాలా ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగాయి. గురువారం రాయ్ పూర్ లో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరో మూడునాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితులు ఉండే అవకాశముందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి.
