Sidhu Moose Wala Murder Case: ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్య అనంతరం .. హంతకులు కారులో తిరుగుతూ.. తమ ఆయుధాలతో సంబరాలు చేసుకుంటున్నారు. కాల్పులు జరిపిన ఓ హతంకుడి ఫోన్లో ఇందుకు సంబంధించిన వీడియో దొరికింది. ఇందులో పంజాబీ సంగీతం బ్యాక్గ్రౌండ్లో మ్రోగుతుండగా.. ఐదుగురు వ్యక్తులు నవ్వుతూ.. కెమెరా ముందు తమ తుపాకీలను ప్రదర్శిస్తూ కనిపించారు.
Sidhu Moose Wala Murder Case: ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. సింగర్ హత్య అనంతరం హంతకులు తుపాకులు ఊపుతూ కారులో సంబరాలు చేసుకుంటున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఐదుగురు నిందితులు కనిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో పంజాబీ సంగీతం మ్రోగుతుండగా.. అందరూ నవ్వుతూ.. కెమెరా ముందు తమ తుపాకీలను ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ వీడియోలో కారు నడుపుతున్న వ్యక్తిని కపిల్ పండిత్ గా, అతని పక్కన సీట్లో కూర్చున్న వ్యక్తి ప్రియవ్రత ఫౌజీ గా గుర్తించారు. అలాగే.. వెనుకు సీట్లో కూర్చున్న వారిని సచిన్ భివానీ, అంకిత్ సిర్సాలు గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాల్పులు జరిపిన వారిలో పిన్న వయస్కుడైన అంకిత్ సిర్సా ను ఆదివారం రాత్రి.. ఢిల్లీలోని బస్ టెర్మినల్ లో అరెస్టు చేశారు. అతని అరెస్టు అనంతనం ఫోన్ను పరిశీలించగా.. పోలీసులకు హత్యకు సంబంధించిన రెండు వీడియోలు కనిపించాయి. ఆ వీడియోలను తన ఇప్పుడు తొలగించిన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. అంకిత్ సిర్సా.. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాలో ప్రధాన సభ్యుడు అని, ఈ హత్యలో కూడా ప్రధాన షూటర్ అని పోలీసులు తెలిపారు.
అతడు సింగర్ అధిక దగ్గరికి వెళ్లి.. ఎక్కువ బుల్లెట్లు కాల్చిన వ్యక్తిగా గుర్తించారు. అంకిత్ సిర్సాని అరెస్ట్ చేసి సమయంలోనే అతని సహచరుడు సచిన్ వీరమణిని కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు. అంకిత్ సిర్సాకు ప్రస్తుతం పద్దెనిమిదిన్నర సంవత్సరాలు మాత్రమే. అంకిత్ సిర్సా మొదటిసారిగా ఒకరిని చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోలో అంకిత్ రెండు చేతుల్లో రెండు పిస్టల్ పట్టుకుని.. సినిమా స్టైల్లో చూపిస్తున్నాడు. అలాగే ఈ వీడియో కనిపిస్తున్న అంకిత్తో పాటు సచిన్ భివానీని కూడా పోలీసులు పట్టుకున్నారు. అతడు అంకిత్ సిర్సా ఎడమ వైపున కూర్చున్నాడు.
ఢిల్లీ పోలీసుల వాదన
అంకిత్, ఇతర దుండగులందరికీ ఆయుధాలు, ఇతర వస్తువులను సచిన్ అందించినట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. హత్యకు కారులో వెళ్లిన వారందరినీ హత్యానంతరం సచిన్ వివిధ రాష్ట్రాల్లో దాచిపెట్టాడు. పరారీలో ఉన్న 34-35 రోజుల్లో సచిన్ భివానీ ఈ దుండగుల కోసం 34-35 సార్లు దాచి ఉంచినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి.. అంకిత్ సిర్సా, సచిన్ భివానీలను ఢిల్లీలోని కశ్మీర్ గేట్ బస్టాండ్ సమీపంలో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పట్టుకుంది. ఆ సమయంలో కూడా ఇద్దరి నుంచి మూడు పంజాబ్ పోలీస్ యూనిఫారాలు, 2 పిస్టల్స్, 19 కాట్రిడ్జ్లు, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఫేస్బుక్ పోస్ట్లో గాయకుడి హత్యను నిర్వహించడానికి బాధ్యత వహించాడు.
అంకిత్ సిర్సా హర్యానాలోని సోనిపట్లోని సిర్సా గ్రామ నివాసి. తండ్రి ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అంకిత్ కు చదువుకోవడం ఇష్టంలేక 10వ తరగతి ఫెయిల్ అయ్యాక.. చెడు సహావాసాలు పట్టి.. మొబైల్స్ దొంగతనం చేయడం మొదలుపెట్టి మెల్లగా నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.