Sidhu Moose Wala Murder Case: సిద్ధూ మూసేవాలా హత్య కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులకు నకిలీ పాస్పోర్ట్ను అందించడంతో సహకరించినా.. ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారని అధికారులు బుధవారం తెలిపారు. నిందితులను రాహుల్ సర్కార్ (27), అర్జిత్ కుమార్ (55), నవనీత్ ప్రజాపతి (33), సోమనాథ్ ప్రజాపతి (33), 27 ఏళ్ల మహిళగా గుర్తించినట్లు వారు తెలిపారు.
Sidhu Moose Wala Murder Case: సిద్ధూ మూసేవాలా హత్య కేసులో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ముసేవాలా హత్యకు ముందు తీహార్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, మేనల్లుడు సచిన్ బిష్ణోయ్లను నకిలీ పాస్పోర్ట్ల ద్వారా భారతదేశం నుండి బయటకు పంపించాలనే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది. ఢిల్లీ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నుంచి ఈ నకిలీ పాస్పోర్టును తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. లారెన్స్ సోదరుడు అన్మోల్, సచిన్ల నకిలీ పాస్పోర్టులను తయారు చేసిన ముఠాను కూడా దక్షిణ ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు.
నకిలీ పాస్ పోర్టులతో విదేశాలకు..
ఈ పాస్పోర్ట్లో సచిన్ బిష్ణోయ్ పేరును తిలక్ రాజ్ తుతేజా అని రాసి ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో తండ్రి పేరు భీమ్ సింగ్, ఇంటి నంబర్ 330, బ్లాక్ ఎఫ్3 సంగమ్ విహార్ న్యూఢిల్లీ-110062 అని రాసి ఉంది. అతను ఈ నకిలీ పాస్పోర్ట్ ద్వారా దుబాయ్కి వెళ్లాలని ఫ్లాన్ వేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పుడు సచిన్ బిష్ణోయ్ అజర్బైజాన్లో ఉన్నాడు. జోధ్పూర్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, లారెన్స్ తన సోదరుడు అన్మోల్ పాస్పోర్ట్ను భాను ప్రతాప్ పేరుతో తయారు చేసి, దానిపై ఫరీదాబాద్ హర్యానా చిరునామాను ఇచ్చాడు.లారెన్స్ బిష్ణోయ్ విచారణలో వెల్లడించాడు, ఆ తర్వాత పంజాబ్ పోలీసులు అతనిపై పాస్పోర్ట్ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీ పోలీస్ డీసీపీ ఏం చెప్పారంటే?
మే 29న సిద్ధూ ముసేవాలా హత్యకు గురయ్యారని, లారెన్స్ బిష్ణోయ్ సూచన మేరకు అతని సోదరుడు అన్మోల్, మేనల్లుడు సచిన్ బిష్ణోయ్ కుట్ర పన్నారని దక్షిణ ఢిల్లీ డీసీపీ బినితా మేరీ జాకర్ తెలిపారు. వీరిద్దరూ ముష్కరులను ఏర్పాటు చేసి నకిలీ పాస్పోర్టుల ద్వారా విదేశాలకు పారిపోయారు. దర్యాప్తులో నకిలీ పాస్పోర్టుల విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పాస్ పోర్టులు దక్షిణ ఢిల్లీలో తయారయ్యాయని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత దక్షిణ జిల్లా పోలీసులు అన్మోల్ బిష్ణోయ్, సచిన్ బిష్ణోయ్లకు నకిలీ పాస్పోర్ట్ల తయారీలో సహాయం చేసిన వ్యక్తుల కోసం వెతకడం ప్రారంభించారు.
ఎంత మంది నిందితులను అరెస్టు చేశారు?
నకిలీ పాస్పోర్టులు తయారు చేసిన కేసులో ఐదుగురు నిందితులను దక్షిణ జిల్లా ప్రత్యేక సిబ్బంది అరెస్టు చేశారు. అరెస్టయిన నిందితుల పేర్లు రాహుల్ సర్కార్, నవనీత్ ప్రజాపతి, అర్జిత్ కుమార్ అలియాస్ మహేష్ అలియాస్ సిద్ధు పాజీ, సోమనాథ్ ప్రజాపతి. ఇదే సమయంలో వీరి నుంచి.. 1 పిస్టల్, నాలుగు ల్యాప్టాప్లు, 4 మొబైల్ ఫోన్లు, డాంగిల్, ఆధార్ కార్డ్, మెర్సిడెస్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నకిలీ పాస్పోర్టును ఢిల్లీలో తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పాస్పోర్ట్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో తయారైందని దక్షిణ ఢిల్లీలోని ప్రత్యేక సిబ్బంది గుర్తించారు. సంగం విహార్లో నివాసముంటున్న రాహుల్ సర్కార్ అనే వ్యక్తి నకిలీ పాస్పోర్ట్ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు తయారు చేయడంలో నిపుణుడు.
పాస్పోర్టుకు ఎంత చెల్లించారు?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ మేనల్లుడు సచిన్ బిష్ణోయ్ పాస్పోర్టుకు లక్షన్నర రూపాయలు చెల్లించారనీ, ఆ పాస్ పోర్టుపై అతని పేరు తిలక్ రాజ్ తుతేజా పేరు ఉందని పోలీసులు తెలిపారు. రాహుల్ సర్కార్తో పాటు, సోమనాథ్ ప్రజాపతి, నవనీత్ ప్రజాపతిలు సచిన్, అన్మోల్లకు మొదటి నకిలీ ఓటర్ కార్డు, నకిలీ ఆధార్ కార్డును తయారు చేసేందుకు సహాయం చేశారు.
నవనీత్కు సొంతంగా ఆధార్ కేంద్రం ఉందని, నకిలీ ఆధార్కార్డు తయారు చేయడంలో సహకరించాడని పోలీసులు తెలిపారు. 15 వేలకు నకిలీ ఆధార్ కార్డు తయారీకి ఒప్పందం జరిగినట్టు తెలుస్తుంది. నకిలీ ఆధార్ కార్డును తయారు చేసి, పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న అగంతకులు ఏప్రిల్ 13 తేదీని పాస్పోర్ట్ కార్యాలయం నుండి పొందారు. సచిన్ విష్ణోయ్ స్వయంగా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లి అక్కడ వేలిముద్రలు ఇచ్చి తిరిగి వచ్చారని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎప్పుడు వెరిఫికేషన్ కోసం ఫోన్ చేసినా ఢిల్లీలో లేడని చెప్పేవాడు.
సిద్ధూ పాజీ ఎవరు? ఈ కేసులో అతడి ప్రమేయం ఎలా ఉంది?
ప్రస్తుతం ఈ సిద్ధూ పాజీ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు. అమృత్సర్ నుంచి పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతడు క్రూరమైన నేరస్థుడని, నకిలీ పాస్పోర్టులు, నకిలీ వీసాల తయారీలో ప్రావీణ్యం సంపాదించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటికే జైలుకు వెళ్లాడు. లారెన్స్ బిష్ణోయ్ ఈ పనిని సిద్ధూ పాజీకి ఇచ్చాడని, ఈ పని కోసం సిద్ధూ పాజీ రాహుల్ సర్కార్ కోసం వెతికాడని, ఆ తర్వాత రాహుల్ తన ఇతర సహచరులతో కలిసి సచిన్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్ల నకిలీ పాస్పోర్ట్లను తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు.