Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న కర్నాటక మాజీ సీఎం...

కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య రోడ్డు ప్రమాదం నుండి తృటితో తప్పించుకున్నారు. ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదాన్కోకటి ఢీకొట్టుకున్నప్పటికి సిద్దరామయ్య మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో సిద్దరామయ్య కాన్వాయ్ లోని ఐదు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా...అందులో ప్రయాణిస్తున్న ఓ ఎస్సై ఆందోళనకు గురై గుండెపోటుతో మరణించాడు. 
 

Siddaramaiah's convoy meets with accident
Author
Bangalore, First Published Jan 10, 2019, 6:18 PM IST

కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య రోడ్డు ప్రమాదం నుండి తృటితో తప్పించుకున్నారు. ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదాన్కోకటి ఢీకొట్టుకున్నప్పటికి సిద్దరామయ్య మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో సిద్దరామయ్య కాన్వాయ్ లోని ఐదు వాహనాలు తీవ్రంగా దెబ్బతినగా...అందులో ప్రయాణిస్తున్న ఓ ఎస్సై ఆందోళనకు గురై గుండెపోటుతో మరణించాడు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్నాటక రాజధాని బెంగళూరు నుండి సిద్దరామయ్య మైసూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని వెనుకనుండి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం ముందున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఇలా దాదాపు కాన్వాయ్ లోని ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. ప్రమాదానికి గురైన వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

అయితే ప్రమాదానికి గురైన వాహనాలకు సిద్దరామయ్య ప్రయాణిస్తున్న కారు దూరంగా వుండటంతో ఫెను ప్రమాదం తప్పింది. ఈ రోడ్డు ప్రమాదం నుండి  సిద్దరామయ్య సురక్షితంగా బయటపడ్డారు. అయితే  ఈ ప్రమాద సమయంలో ఆందోళనకు గురైన సిద్దరామయ్య సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై మారిగౌడ గుండెపోటుతో మృతిచెందాడు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్దరామయ్య ప్రస్తుత జేడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios