Asianet News TeluguAsianet News Telugu

అదుపుతప్పి తుంగభద్ర కాలువలో పడిపోయిన ఆటో.. ముగ్గురు మృతి, మరో ముగ్గురు గల్లంతు

కర్ణాటకలోని బళ్లారి  తాలుకా కొలగల్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలం పనుల కోసం కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి తుంగభద్ర కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.

several killed after auto falls in canal near bellary in karnataka
Author
First Published Sep 14, 2022, 1:56 PM IST

కర్ణాటకలోని బళ్లారి  తాలుకా కొలగల్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలం పనుల కోసం కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి తుంగభద్ర కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒక్కరు ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ముగ్గురు కాలువలో గల్లంతయ్యారు. కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 11 మంది ఉన్నట్టుగా చెబుతున్నారు. 

ఈ ప్రమాదంపై కర్ణాటక మంత్రి బి శ్రీరాములు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాలువలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తుంగభద్ర కాలువ పొంగిపొర్లడంతో  సహాయక చర్యలకు స్వల్ప ఆటంకం ఏర్పడిందని చెప్పారు. అయితే ఆ తర్వాత గల్లంతైన వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వారికి తగిన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. నీటిలో గల్లంతైనవారు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios