తమిళనాడులో ఓ టిప్పర్ లారీ జనాలపైకి దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు

తమిళనాడు : తమిళనాడులో ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న పాదచారులపైకి టిప్పర్ లారీ దూసుకెళ్ళింది. దీంతో అక్కడంతా బీభత్స వాతావరణం నెలకొంది. అరుపులు, హాహా కారాలు, రక్తం మరకలు, మాంసముద్దలుగా ఆ ప్రాంతం అంతా భయానకంగా తయారయ్యింది. 

ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. చెంగల్ పట్టు కుదువాంచేరి సమీపంలోని పోతేరి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. టిప్పర్ లారీ తిరుచ్చి నుంచి చెన్నె వెల్తండగా ఘటన జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.