రాజస్తాన్ లోని దౌసాలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
రాజస్థాన్ : రాజస్థాన్లోని దౌసాలో ట్రక్కు ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో వాహనంలో ఆరుగురు చనిపోయారు. ఈ మేరకు పోలీసులు నిర్ధారించారు. రాజస్థాన్లోని దౌసాలోని మందావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
"మాందావర్ PS పరిధిలోని ఉక్రుంద్ గ్రామం సమీపంలో ఒక ట్రక్కు వాహనాన్ని ఢీకొట్టింది, ఇందులో ఆరుగురు మరణించారు, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ జైపూర్కు తరలించారు. మరో ఐదుగురిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు" అని ఏఎస్పీ బజరంగ్ సింగ్ షెకావత్ తెలిపారు.
