Asianet News TeluguAsianet News Telugu

భార్యకు పెళ్లి రోజు కానుకగా చంద్రుడి మీద భూమి కొనిచ్చిన భర్త..

రాజస్థాన్ అజ్మీర్ లో ఓ వ్యక్తి పెళ్లి రోజు కానుకగా తన భార్యకు ఏకంగా చంద్రుడి మీద మూడెకరాల భూమిని గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో ఈ రాజస్తాన్‌ వ్యాపారవేత్త ధర్మేంద్ర అనీజా వార్తల్లోని ఎక్కాడు.

Rajasthan man 'gifts' wife a piece of land on Moon on wedding anniversary  - bsb
Author
Hyderabad, First Published Dec 30, 2020, 9:47 AM IST

రాజస్థాన్ అజ్మీర్ లో ఓ వ్యక్తి పెళ్లి రోజు కానుకగా తన భార్యకు ఏకంగా చంద్రుడి మీద మూడెకరాల భూమిని గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో ఈ రాజస్తాన్‌ వ్యాపారవేత్త ధర్మేంద్ర అనీజా వార్తల్లోని ఎక్కాడు.

డిసెంబర్ 24న తమ ఎనిమిదో మ్యారేజ్ డే సందర్భంగా భార్యకు ఈ బహుమతి ఇచ్చాడు. తన భార్య సప్నా కోసం చంద్రునిమీద భూమి కొని మ్యారేజ్ డే గిఫ్ట్ గా ఇవ్వాలని గత ఏడాదే నిర్ణయించుకున్నాడట ధర్మేంద్ర. అయితే ఇది అంత ఈజీగా జరగలేదు అంటున్నాడు ఆయన. 

చంద్రుడి మీద ప్లేస్ కొనడం ఈజీ అయితే ఇప్పటికే అందరూ కొనేవారు అంటున్నాడు. దీనిమీద సప్నా స్పందిస్తూ  “మా వారు నా కోసం చంద్రుడి మీద స్థలం కొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. విషయం తెలిశాక నాకు ఏడుపు ఆగలేదు. బహుశా ఈ ప్రపంచంలో ఈ బహుమతి పొందిన అదృష్టవంతురాలిని నేనే కావచ్చు” అంటూ భావోద్వేగానికి గురయ్యింది. 

“సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఏంటో ఊహించి చెప్పమని మా యానివర్సరీ కార్యక్రమంలో నన్ను అడిగినప్పుడు ఏ కారో, నగలో అనుకున్నా. కానీ చంద్రుడి మీద భూమిని కొనిస్తారని నేను ఊహించలేదు'' అంటూ తననెలా ఆశ్చర్యపరిచాడో మురిపెంగా చెప్పుకొచ్చింది సప్నా.

14.3 ఉత్తరఅక్షాంశం, 5.6 తూర్పు రేఖాంశాలలో 377, 378, 379 నంబర్ల పేరుతో చంద్రుడిపై మూడు ఎకరాల స్థలం కొన్నాడు ధర్మేంద్ర. అంతేకాదు మ్యారేజ్ డే కూడా చంద్రుడి మీదే జరిగిన ఫీలింగ్ వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. 

ధర్మేంద్ర, సప్నా ఇద్దరూ కలిసి చదువుకున్నారు. కాలేజీ రోజుల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ధర్మేంద్ర బ్రెజిల్‌లో టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ బిజినెస్‌ చేస్తుంటారు.

“భూమి మీద స్థలం కొనాలంటే ఎలాంటి పద్ధతులుంటాయో.. చంద్రునిమీద కొనడానికి కూడా అలాగే కొన్ని పద్ధతులుంటాయి. కాకపోతే అది కాస్త లాంగ్ ప్రాసెస్’’ అన్నారు ధర్మేంద్ర.

చంద్రుని మీద భూమిని కొనడానికి ఏడాది కిందటే అమెరికాకు చెందిన ఒక సంస్థ దగ్గర అప్లికేషన్‌ పెట్టుకున్నాడు ధర్మేంద్ర. ఆ సంస్థ దరఖాస్తును ఓకే చేసిన తర్వాత ఆయన చాలాసార్లు వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొని,  ఆయన కుటుంబం, ఆస్తిపాస్తుల వివరాలు ఆధారాలతో సహా తెలుసుకున్నారు. దీనికే దాదాపు సంవత్సరం పట్టింది.

“చంద్రునిపై స్థలం అమ్ముతామని చెప్పి అనేక నకిలీ కంపెనీలు నన్ను కలిశాయి. కానీ  చంద్రునిపై దిగే అధికారం ఉన్న ఏకైక సంస్థ 'లూనా సొసైటీ ఇంటర్నేషనల్' మాత్రమే’’ అన్నారు ధర్మేంద్ర.

చంద్రునిపై అనేక రకాల భూములు ఉన్నాయని, అక్కడ కొనే భూమికి 1 ఏడాది నుంచి 49 ఏళ్ల వరకు యాజమాన్య హక్కులు ఉంటాయని, తాను 49 సంవత్సరాలకు ఓనర్‌ షిప్‌ రైట్స్‌ తీసుకున్నానని ధర్మేంద్ర వివరించారు. చంద్రునిపై కొనుగోలు చేసిన భూమి మీద ఏదైనా పరిశోధన జరిగితే రాయల్టీ అందుతుందని ధర్మేంద్ర వెల్లడించారు. ఈ భూమిని తాను ఎవరికైనా అమ్ముకోవడం, బదిలీ చేయడం లాంటివి చేయచ్చని ఆయన వివరించారు.

ఇక మ్యారేజ్ డే కూడా చంద్రుడి మీద జరిగినట్లు ఏర్పాటు చేశాడు ధర్మేంద్ర “చంద్రుడి మీదే రిజిస్ట్రేషన్‌ పేపర్లు అందుకుంటున్నట్లు అనిపించింది. నేను చాలా అదృష్టవంతురాలిని’’ అని సప్న అంది. ఈ బహుమతిని ప్రజెంట్‌ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ధర్మేంద్ర. ఈ బాధ్యతను అజ్మీర్‌కు చెందిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్‌ ఈవెంట్స్‌ సంస్థకు అప్పగించారు.
కార్యక్రమమంతా చంద్రుడి వాతావరణంలో జరిగినట్లు ఉండాలని ఆయన ఈవెంట్స్‌ సంస్థను కోరారు.

“చంద్రునిపై భూమిని కొన్నానని ధర్మేంద్ర చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆయన నాకు 17 పేజీల పత్రాలను చూపించారు. మేం ఆశ్చర్యపోతూనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం’’ అని ఈవెంట్స్‌ నిర్వాహకుడు కోసినాక్‌ జైన్ అన్నారు. “కార్యక్రమం చంద్రుని మీద ఉన్నట్లే అనిపించేలా ఉండేందుకు చాలా శ్రమపడ్డాం” అన్నారు జైన్‌.

ఎల్‌ఈడీ లైట్లతో నాలుగు అడుగులమేర మేఘాలను, చంద్రుడిని, నక్షత్రాలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు కూడా తాము చంద్రుడి మీద ఉన్న ఫీలింగ్‌ కలిగిందట. 

Follow Us:
Download App:
  • android
  • ios