యాచకుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జైపూర్ లోబెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాజ​స్తాన్‌ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సోపన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ భాగస్వామ్యంతో బెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

యాచకుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జైపూర్ లోబెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాజ​స్తాన్‌ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సోపన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ భాగస్వామ్యంతో బెగ్గర్ ఫ్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 43మంది బెగ్గర్స్ ను చేరదీశారు. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల నుంచి జైపూర్‌ లో యాచిస్తూ బతుకుతున్నారు. ఈ 43 మందికి వసతి సదుపాయం కల్పించారు. వీరికి యోగా, ఆటలు కంప్యూటర్‌ తరగతులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. 

ఈ బెగ్గర్స్‌ ఫ్రీ కార్యక్రమం గురించి రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నీరజ్ కుమార్ పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యాచకులందర్ని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. యాచకులు లేని రాష్ట్రంగా రాజస్థాన్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పవన్ తెలిపారు. 

రాజస్థాన్‌ పోలీసులు జైపూర్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా బెగ్గర్స్‌ ఫ్రీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినట్లు, దీనికోసం కౌశల్ వర్థన్ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి బ్యాచుల వారీగా బెగ్గర్స్ కు శిక్షణ నిస్తున్నట్లు చెప్పారు. 

ప్రస్తుతం 20 మంది నైపుణ్య శిక్షణ పొందుతున్నారని, శిక్షణ పూర్తైన తరువాత ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తొలిసారిగా జైపూర్ లో ప్రారంభంచిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. 

సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరు కాస్త భిన్నంగా ఉంటారు. మానసికంగానే కాక, వివిధ అనారోగ్య సమస్యలతో శారీరకంగానూ బలహీనంగా ఉంటారని యోగా ట్రైనర్ అన్నారు. అందుకే వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మానసిక, శారీరక స్థితిగతులను అంచనా వేసిన తరువాతే వారికి యోగా నేర్పిస్తున్నట్లు చెప్పారు. 

సమాజంలో యాచకులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడమే తమ లక్ష్యమని సోపన్‌ సంస్థ అధికారి చెప్పారు. మూడున్నర నెలలపాటు వారికి శిక్షణతోపాటు రాజస్థాన్‌ ప్రభుత్వం రోజుకు రూ.215 చెల్లిస్తుంది. ఈ డబ్బు భవిష్యత్తులో వారి అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు.