దేశ ప్రతిష్ట కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అర్థం కావడం లేదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. ఆయన ప్రేమ దుకాణం నడపడం లేదని, ద్వేశపు మెగా షాపింగ్ మాల్ నే నిర్వహిస్తున్నాడని ఆరోపించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మొదలుపెట్టిన ‘మొహబ్బత్ కీ దుకాన్’ కార్యక్రమం పట్ల బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. ‘మీరు మొహబ్బత్ కీ దుకాన్ (ప్రేమ దుకాణం) తెరవలేదు. దేశ్వం కోసం మెగా షాపింగ్ మాల్ తెరిచారు’ అని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో సోమవారం ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జేడీ నడ్డా.. మోడీ ప్రభుత్వ 9 ఏళ్ల విజయాలపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు.
విద్యార్థినులపై నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు.. విజయవాడలో ఆందోళన చేపట్టిన బాలికలు
దేశ ప్రతిష్ఠ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి నచ్చడం లేదని, అది ఆయనకు అర్థం కావడం లేదని తెలిపారు. భారత్ గర్వం పెరుగుతోందని, కానీ ఇందులో రాహుల్ గాంధీకి ఉన్న సమస్య ఏమిటో తనకు తెలియడం లేదని అన్నారు. ‘‘ఈ గర్వంను అర్థం చేసుకోలేడు. ఇష్టపడడు. ప్రపంచంలోని 100 దేశాలు భారత్ వ్యాక్సిన్ తీసుకుంటే మీరు (రాహుల్ గాంధీ) ప్రపంచ వ్యాక్సిన్ ను ప్రశంసిస్తున్నారు, భారత వ్యాక్సిన్ ను ప్రశ్నిస్తున్నారు. మీరు సర్జికల్ స్ట్రైక్ ను ప్రశ్నిస్తున్నారు. మీరు సమాజాన్ని విభజించడం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ మీరు 'మొహబ్బత్ కీ దుకాన్' నడుపుతున్నట్లు చెబుతున్నారు. కానీ మీరు ద్వేషంతో కూడిన 'మెగా షాపింగ్ మాల్'ను నడుపుతున్నారు’’ అని జేపీ నడ్డా మండిపడ్డారు.
నీలిచిత్రాలకు బానిసై.. ఆరుగురు బాలికలపై ప్రిన్సిపాల్ ఆఘాయిత్యం..
కరోనా మహమ్మారిని ఎలా మేనేజ్ చేయాలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచానికి నిరూపించారని జేపీ నడ్డా కొనియాడారు. కోవిడ్ సమయంలో ప్రపంచంలోని ప్రతి దేశం విఫలమైందని, అయితే ప్రధాని మోడీ సకాలంలో సాహసోపేత నిర్ణయం తీసుకుని దేశంలో లాక్డౌన్ ప్రకటించి లెక్కలేనన్ని విలువైన ప్రాణాలను కాపాడారని అన్నారు.
2014కు ముందు, 2014 తరువాత కాలానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని కేంద్రంలోని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘(కాంగ్రెస్) తో ఏమీ మారదని, అవినీతిని తుడిచిపెట్టలేరని ప్రజలు విశ్వసించారు. ఆ సమయంలో మన దేశం అవినీతి దేశాలలో ఒకటిగా పరిగణలో ఉంది. నాయకత్వమూ, ఉద్దేశమూ, విధానమూ లేదు. అయితే ప్రజలు బీజేపీకి ఓటేశారు. దీంతో 2014లో భారత్ ను ముందుకు నడిపించే నాయకత్వం లభించింది’’ అని అన్నారు.
Gas Cylinder: రూ.500 లకే గ్యాస్ సిలిండర్... ఆ రాష్ట్ర ప్రజలకు వరం ..
ఆర్థిక పరంగా చూస్తే నేడు బ్రిటన్ ను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదని రిషి సునక్ కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు.