Qutab Minar: ఢిల్లీలోని కుతుబ్మినార్ ఒకప్పుడు విష్ణు స్తంభం అని, దాన్ని హిందూ రాజు కాలంలో విష్ణు ఆలయంపై నిర్మించారని వీహెచ్పీ నేత వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. ఈ స్తంభంలోని కొన్ని భాగాలను ఓ ముస్లిం పాలకుడు పునర్నిర్మించి కువ్వత్-ఉల్-ఇస్లాంగా పేరు మార్చారని అన్నారు. టవర్ కింది మూడు ఫ్లోర్లు, మిగతా ఫోర్ల మధ్య స్పష్టమైన వ్యత్యాసం చూడొచ్చని, అక్కడ ఉన్న పురాతన ఆలయాలను పునర్నిర్మించాలని, అక్కడ హిందూ ఆచారాలు, ప్రార్థనలు తిరిగి ప్రారంభించాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది.
Qutab Minar: ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉన్న కుతుబ్ మినార్ ఒకప్పుడు విష్ణు స్తంభం అని, దాన్ని హిందూ రాజు కాలంలో విష్ణు ఆలయంపై నిర్మించారని వీహెచ్పీ నేత వినోద్ బన్సాల్ వ్యాఖ్యానించారు. హిందూ పాలకుల కాలంలో నిర్మించిన విష్ణువు ఆలయంపై 73 మీటర్ల ఎత్తైన కట్టడాన్ని నిర్మించారని పేర్కొన్నారు. భారత్ లో.. ముస్లిం పాలకులు వచ్చిన తరువాత.. 27 హిందూ-జైన్ దేవాలయాలను కూల్చివేశారనీ,
తరువాత లభించిన వస్తువులతో ,, ఈ స్తంభంలోని కొన్ని భాగాలను ఓ ముస్లిం పాలకుడు పునర్నిర్మించి కువ్వత్-ఉల్-ఇస్లాంగా పేరు మార్చారని, పేరు మార్చడానికి ముందు అది ‘విష్ణు స్తంభం’ అని అన్నారు. టవర్ మొదటి మూడు అంతస్తుల నిర్మాణంలో, మిగిలిన అంతస్తుల పైభాగంలో ఒక స్పష్టమైన వ్యత్యాసాన్ని చూడవచ్చుననీ, ముస్లిం పాలకులు కేవలం ఇస్లాం ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని ఈ నిర్మించారని పేర్కొన్నారు
కుతాబ్ మినార్ నిజానికి విష్ణు దేవాలయం మీద నిర్మించిన విష్ణు స్తంభమని.. దానిని ముస్లిం పాలకులునిర్మించలేదని ,. మన హిందూ పాలకులు దీనిని నిర్మించారని వీహెచ్పీ నేత వినోద్ బన్సాల్ పేర్కొన్నారు. కుతాబ్ మినార్ కాంప్లెక్స్లోని పురాతన దేవాలయాలను పునర్నిర్మించాలని, అక్కడ హిందూ ఆచారాలు, ప్రార్థనలను పునరుద్ధరించడానికి అనుమతించాలని VHP నేత ప్రభుత్వాన్ని కోరారు. 1993లో UNESCO చే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన స్మారక చిహ్నం కాంప్లెక్స్లో బన్సాల్తో సహా VHP నాయకుల బృందం సందర్శించింది.
కుతాబ్ మినార్ కాంప్లెక్స్లో గణేశ విగ్రహాలను అగౌరవంగా ఉంచారని నేషనల్ మాన్యుమెంట్ అథారిటీ (ఎన్ఎంఎ) ఛైర్మన్, బిజెపి నాయకుడు తరుణ్ విజయ్ గురువారం అన్నారు. అక్కడ దేవత విగ్రహాలు సందర్శకుల నడిచే చోట ఉన్నాయనీ, అక్కడ నుంచి విగ్రహాలను తొలగించాలి లేదా కుతుబ్ కాంప్లెక్స్ లోపల గౌరవప్రదంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితమే.. తాను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)తో సమస్యను లేవనెత్తానని, అయితే తన లేఖకు ఇంకా స్పందన రాలేదని తరుణ్ విజయ్ చెప్పాడు.
VHP అధికార ప్రతినిధి బన్సాల్ మాట్లాడుతూ, "తరుణ్ విజయ్ జీ ASIతో సమస్యను లేవనెత్తారు... ప్రభుత్వం మరియు దాని సంబంధిత విభాగాలు ఈ సమస్యపై తీవ్రంగా ఆలోచించి, హిందూ సమాజం యొక్క గౌరవాన్ని పునరుద్ధరించాలని మేము ఆశిస్తున్నాము." ఈ సమస్యపై VHP యొక్క భవిష్యత్తు కార్యాచరణ గురించి అడిగినప్పుడు, ఈ విషయాన్ని సీనియర్ నాయకులు చర్చిస్తారు మరియు "అవసరమైతే, మేము చట్టపరమైన చర్య తీసుకోవడాన్ని కూడా పరిగణించవచ్చు" అని ఆయన అన్నారు.
ఢిల్లీ టూరిజం వెబ్సైట్ ప్రకారం, ఢిల్లీ యొక్క చివరి హిందూ రాజ్యాన్ని ఓడించిన తర్వాత ఆ స్థలంలో ఉన్న 27 హిందూ దేవాలయాలను కూల్చివేసిన తర్వాత లభించిన వస్తువులతో కుతాబ్ మినార్ నిర్మించబడింది. వెబ్సైట్ ప్రకారం..కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు తూర్పు ద్వారంపై ఉన్న ఒక శాసనంలో 27 హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించబడిందని తెలియజేస్తుంది. ఖువాత్-ఉల్-ఇస్లాం సమ్మేళన మసీదు భవనం.. 1192లో కుతుబుద్-దిన్ ఐబాక్ ద్వారా ప్రారంభించబడి, 1198లో ధ్వంస చేయబడిన హిందూ దేవాలయాల అవశేషాలతో పూర్తి చేయబడినట్టు పేర్కొంది.
కుతుబ్ మినార్ను దాదాపు 1202లో కుతుబుద్-దిన్ ఐబక్ ప్రారంభించాడు. క్రీ.శ. 1326లో, 1368 ADలో పిడుగుపాటుకు గురై.. కొంత భాగం పాడైపోయింది . ఆనాటి పాలకులు ముహమ్మద్-బిన్-తుగ్లక్ (1325-51 AD), ఫిరూజ్ షా తుగ్లక్ (1351-88 AD) మరమ్మతులు చేశారు. క్రీ.శ. 1503లో సికందర్ లోడి పై అంతస్తుల పునరుద్ధరణ, విస్తరణ చేపట్టారు. మసీదు కాంపౌండ్లోని ఇనుప స్తంభాన్ని భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి తీసుకువచ్చినట్లు కూడా నివేదిక పేర్కొంది. ఇది గుప్త రాజు చంద్రగుప్త II (375-413) ని యొక్క విజయాలను చేయబడిన శాసన మని పేర్కొంది.
