స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకాష్ రాజ్ చెప్పారు. సిటిజన్స్ వాయిస్ నినాదంతో ఆయన పార్లమెంటు బరిలోకి దిగుతున్నారు. తన నూతన ప్రయాణానికి లభిస్తున్న ప్రోత్సాహకర స్పందనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ లోకసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని ప్రకాష్ రాజ్ చెప్పారు. సిటిజన్స్ వాయిస్ నినాదంతో ఆయన పార్లమెంటు బరిలోకి దిగుతున్నారు. తన నూతన ప్రయాణానికి లభిస్తున్న ప్రోత్సాహకర స్పందనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మిగతా వివరాలను మీడియా ముఖంగా త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తన రాజకీయ ప్రయాణానికి ప్రోత్సాహాన్ని ఇచ్చినందుకు ఆయన ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కు ధన్యవాదాలు తెలిపారు.
#2019 PARLIAMENT ELECTIONS.Thank you for the warm n encouraging response to my new journey.. I will be contesting from BENGALURU CENTRAL constituency #KARNATAKA as an INDEPENDENT..will share the Details with the media in few days..#citizensvoice #justasking in parliament too... pic.twitter.com/wJN4WaHlZP
— Prakash Raj (@prakashraaj) January 5, 2019
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 5, 2019, 8:14 PM IST