Asianet News TeluguAsianet News Telugu

అనుమానంతో బాలింతైన భార్యను హతమార్చిన పోలీస్..

రక్షించాల్సిన భర్తే రాక్షసంగా మారి భార్యను హతమార్చాడు. పుట్టిన బిడ్డ తనది కాదన్న అనుమానం ఓ పోలీసులు నేరస్తుడిగా మార్చింది.

police killed child-birth wife on suspicion in karnataka - bsb
Author
First Published Nov 9, 2023, 7:49 AM IST

బెంగళూరు : అనుమానం పెనుభూతమయ్యింది. పచ్చి బాలింతరాలు అన్న కనికరాన్ని కూడా కమ్మేసింది. తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసే.. తప్పు చేసిందన్న అనుమానంతో భార్యను దారుణంగా హతమార్చి నేరస్తుడిగా మారాడు. ఈ ఘటన కర్ణాటక లోని బెంగళూరులో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

డి కిషోర్ కర్ణాటక పోలీస్ డిపార్ట్ మెంట్ల పనిచేస్తున్నాడు. అతని భార్య  కర్ణాటకకు చెందిన ప్రతిభ (23) అనే యువతి రెండు వారాల కిందటే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, భర్తకు ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అతి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలియడంతో మహిళ మృతికి సంబంధించి మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

గేదెను ఢీకొనడంతో పట్టాలు తప్పిన రైలు.. పెను ప్రమాదం తప్పింది !

భర్త డి కిషోర్ మొదట భార్యతో బలవంతంగా విషం తాగించాడు. ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాలనే ఉద్దేశ్యంతో - భార్య ప్రతిభను గొంతు కోసి చంపాడు... ఈ మేరకు పోలీసులు, మీడియా సమాచారం. ప్రతిభ హోస్కోట్ తాలూకాలోని తన తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది. అక్కడే ఈ దారుణం చోటు చేసుకుంది. అక్టోబరు 28న ప్రతిభ - ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. కిషోర్ 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న చామరాజనగర్ పట్టణంలో నివసిస్తున్నాడు.

కూతురి మృతిపై దిక్కుతోచని స్థితిలో ఉన్న యువతి తండ్రి తన అల్లుడిని ‘సైకో’ అని చెప్పుకొచ్చాడు. ‘‘మా కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేశాం.. మంచివాడని భావించి నేరస్థుడిగా మారాడు.. మాకు న్యాయం కావాలి.. అతడికి శిక్ష పడాలి.. నా కూతురు చేసిన పనికి మరో అమ్మాయి వెళ్లడం ఇష్టం లేదు. "

కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేసిన ప్రతిభ, కోలారు జిల్లా వీరపురానికి చెందిన 32 ఏళ్ల కిషోర్‌ల వివాహం గతేడాది నవంబర్‌లో జరిగింది. ఆమె తండ్రి కూడా వరకట్న డిమాండ్లను ఆరోపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం సాయంత్రం కిషోర్, ప్రతిభ మధ్య టెలిఫోన్ లో వాదన జరిగింది. దీంతో ప్రతిభ కన్నీరు మున్నీరయ్యింది. వారి సంభాషణ విన్న ప్రతిభ తల్లి ఆమెకు కాల్ డిస్‌కనెక్ట్ చేయమని చెప్పింది. కొత్తగా పుట్టిన బిడ్డ మీద ఆ ప్రభావం పడుతుందని, కొద్ది సేపు కిషోర్‌తో మాట్లాడొద్దని సూచించింది.

ఆ తరువాత, సోమవారం ప్రతిభ తన ఫోన్‌ చూడగా.  కిషోర్ వి 150 మిస్డ్‌ కాల్‌లు ఉన్నాయి. ఆ తరువాతి రోజే కిషోర్ తన అత్తమామల ఇంటికి వచ్చాడు. తన భార్యను గదిలోకి బంధించి, తాళం వేశాడు. అక్కడ ఆమెను హత్య చేశాడు. ఆ సమయంలో ప్రతిభ తల్లి టెర్రస్ మీదికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, కిషోర్ అక్కడినుంచి పారిపోయే ముందు.. తన అత్తగారితో "నేను ఆమెను చంపాను, నేను ఆమెను చంపాను" అని ఒప్పుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios