Asianet News TeluguAsianet News Telugu

అహ్మదాబాద్ కు మరో మణిహారం.. రివర్‌ఫ్రంట్ ఎఫ్‌ఓబి.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

అహ్మాదాబాద్ లో మరో చారిత్రక నిర్మాణానికి ప్రధాని మోదీ శనివారం ప్రారంభోత్సవం చేయనున్నారు. తూర్పు- పశ్చిమ ఒడ్డులను కలిపే ఈ రివర్ ఫ్రంట్ ఎఫ్ వోబీ మరో అద్భుతమైన ఆకర్షణగా మారనుంది. 

PM Modi to inaugurate iconic Riverfront FOB in Ahmedabad
Author
First Published Aug 26, 2022, 1:15 PM IST

న్యూఢిల్లీ : గత వారం భారత్ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా.. అనేక కార్యక్రమాలతో జరుపుకుంది. అదే రోజున, అహ్మదాబాద్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సబర్మతి రివర్ ఫ్రంట్ కూడా ఒక దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ ను చూడడానికి పర్యాటకులు, సందర్శకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, ఎల్లిస్ బ్రిడ్జ్, సర్దార్ బ్రిడ్జ్ ల మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో మరో ఆకర్షణ తోడయ్యింది. 

సబర్మతి రివర్‌ ఫ్రంట్‌కు తూర్పు, పడమర ప్రాంతాలను కలిపే ఈ 300 మీటర్ల వంతెనను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ వంతెన బహుళ స్థాయి కార్ పార్కింగ్‌ ఉంది. తూర్పు- పశ్చిమ ఒడ్డున ఉన్న వివిధ రకాల పబ్లిక్ డెవలప్ మెంట్ లకు అనుసంధానం కల్పిస్తుంది. 

PM Modi to inaugurate iconic Riverfront FOB in Ahmedabad
వెస్ట్ బ్యాంక్‌లోని ఫ్లవర్ పార్క్, ఈవెంట్ గ్రౌండ్ మధ్య ప్లాజా నుండి ఈస్ట్ బ్యాంక్‌లోని ప్రతిపాదిత ఆర్ట్ / కల్చరల్ / ఎగ్జిబిషన్ సెంటర్ వరకు ఇది ఉంటుంది. సాంకేతికంగా, విజువల్ గా కూడా అద్భుతంగా, రూపకల్పనలో విభిన్నంగా ఉన్న ఈ రివర్ ఫ్రంట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్  అహ్మదాబాద్ ఖ్యాతిని పెంచుతుంది. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతంగా మారుతుంది.

PM Modi to inaugurate iconic Riverfront FOB in Ahmedabad
 

PM Modi to inaugurate iconic Riverfront FOB in Ahmedabad

Follow Us:
Download App:
  • android
  • ios