ప్రధాని మోడీ ఈ రోజు తన జర్మనీ పర్యటనలో ప్రవాస భారతీయులను కలిశారు. ఈ కార్యక్రమంలో ఓ బాలిక నరేంద్ర మోడీకి తాను గీసిన మోడీ చిత్రపటాన్ని అందించారు. ఆ చిత్రాన్ని చూసి దానిపై మోడీ తన ఆటోగ్రాఫ్ పెట్టారు. అనంతరం ఓ పిల్లాడు దేశభక్తి పాట పాడారు. దానికి మోడీ కూడా చిటికెలు వేస్తూ హుషారు పెంచారు.

న్యూఢిల్లీ: భారత ప్రధాని సోమవారం జర్మనీలో ప్రవాస భారతీయులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారితో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. అందులో కొందరు ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని కూడా పొందరు. కాగా, ఓ పిల్లాడు ప్రధాని మోడీకి దేశ భక్తి పాట పాడి వినిపించాడు. ఆ పిల్లాడి పాటను ఆసక్తిగా విన్న ప్రధాని మోడీ.. మధ్యలోనే తన చిటికెలతో పిల్లాడికి మరింత హుషారు తెప్పించాడు. దీంతో ఆ హోటల్ హాల్ మొత్తం ఆ పాట వింటూ ఎంజాయ్ చేశారు.

Scroll to load tweet…

బెర్లిన్‌లోని హోటల్ అడ్లాన్ కెంపిన్‌స్కిలో ప్రవాస భారతీయులను ప్రధాని మోడీ కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలోనే పిల్లాడు పాట పాడాడు. అంతకంటే ముందే ప్రధాని మోడీతో ఓ బాలిక మాట్లాడింది. ఆమె ప్రధాని మోడీని తన ఇన్‌స్పిరేషన్ అని చెప్పింది. ఆ తర్వాత ఆమె తాను వేసిన ప్రధాని మోడీ స్కెచ్ చిత్రపటాన్ని అందించారు. మోడీ ఆ రేఖా చిత్రాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఆ స్కెచ్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అనంతరం ఓ పిల్లాడు దేశ భక్తి పాట పాడారు. కాగా, అక్కడ ప్రవాస భారతీయులంతా ప్రధాని మోడీతో కలిసి ఉన్నట్టుగా కనిపించే ఫొటోలు, వీడియోల కోసం తాపత్రయ పడ్డారు. అందరూ ఒకరితో మరొకరు పోటీ పడి వీడియోలు తీసుకున్నారు.