Asianet News TeluguAsianet News Telugu

Parliament winter session: కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు.. ఉభ‌య‌స‌భ‌ల్లో టీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం

నేటి నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు (Parliament winter session 2021) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో విపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలు (adjournment motion) ఇచ్చాయి.  ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని ఉభ‌య‌స‌భ‌ల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. 

Parliament winter session 2021 LIVE updates TRS adjournment motion notice in Rajya Sabha
Author
New Delhi, First Published Nov 29, 2021, 10:23 AM IST

నేటి నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు (Parliament winter session 2021) ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే అధికార, విపక్షాలు తమ అస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. పార్లమెంట్ సమావేశాల తొలి రోజే.. సాగు చట్టాల రద్దు (repealing of three farm laws) బిల్లును సభ ముందుకు తీసుకురావాలని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తుంది. అలాగే కీలకమైన బిల్లులను ఈ సమావేశాల్లో తీసుకురానుంది. అయితే రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దతపై,  సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని విపక్షాలు గట్టిగా కేంద్రాన్ని కోరనున్నాయి. సాగు చట్టాలను కేంద్రం మరో రూపంలో తీసుకు వస్తుందని అనుమానిస్తున్న విపక్షాలు.. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ వివరంగా సమాధానం చెప్పాలిన డిమాండ్ చేయనున్నాయి. 

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో విపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలు (adjournment motion) ఇచ్చారు. సాగు చట్టాలు, రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలు ఇచ్చింది. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.. వ్యవసాయ చట్టాల నిరసనల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారంకు సంబంధించింది వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. 'మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని ప్రారంభించాలని, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలో గత ఏడాది కాలంలో మరణించిన 700 మంది రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలనే డిమాండ్‌పై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. 

- రాజ్యసభలో కనీస మద్దతు ధరను చట్టబద్దత చేయాలని సీపీఐ నోటీసులు ఇచ్చింది. 

-ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని ఉభ‌య‌స‌భ‌ల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. . తెలంగాణలో వరి ధాన్యం సేకరణలో ఎఫ్‌సీఐ జాప్యం,  ధాన్యం సేకరణలో కేంద్రం వివక్షపై చర్చించాలని టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. రూల్ 267 కింద త‌క్ష‌ణ‌మే ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై లోక్‌స‌భ‌లో నామా నాగేశ్వ‌రరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ధాన్యం సేకరణలో కేంద్రం వివక్షపై చర్చ చేపట్టాలని కోరారు. 

- తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇప్పటికీ  వరి ధాన్యం కల్లాల్లోనే ఉందన్న రేవంత్ రెడ్డి.. రైతుల ఇబ్బందులపై చర్చించాలని కోరారు. 

ఉదయం 10.30 గంటలకు బీఏసీ సమావేశం..
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (Business Advisory Committee) సమావేశం ఉదయం 10.30 గంటలకు జరగనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios