Pakistan ISI hijab row: హిజాబ్ అంశాన్ని ఆధారంగా చేసుకుని.. భారత్ వ్యతిరేక శక్తులు... ఉర్దూయిస్థాన్ భావనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలను తాజాగా హెచ్చరించింది. ఈ తరుణంలో సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వాన్ర్ సింగ్ పన్నుతో చేతులు కలిపే అవకాశముందని హెచ్చరించాయి. ఉగ్రవాద సంస్థ SFJ కదిలికపై నిఘా ఉంచాలని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.
Pakistan ISI hijab row: కర్నాటకలో హిజాబ్ వివాదంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హిజాబ్ ధరించిన బాలికలను వేరుగా కూర్చోబెట్టడం, వారిని కాలేజ్ల్లోకి అనుమతించకపోవడంతో పరిస్థితులు చేదాటాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. దీంతో విద్యాసంస్థలు మూడురోజులపాటు సెలవులు ప్రకటించారు. మొత్తానికి హిజాబ్ వివాదం చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం ఉంది.
ఈ వివాదాన్ని మరి పెద్దదిగా చూడోద్దని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టుకు హెచ్చరించింది. భావోద్వేగాలతో పనిలేదని..రాజ్యాంగంతోనే పనేనని…రాజ్యాంగం ఎలా నిర్ణయం తీసుకోవాలో..అలాగే తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు హిజాబ్ వివాదంపై చర్చకు పట్టుబట్టడంతో స్పీకర్ తిరస్కరించారు. దీంతో విపక్షాలు వాకౌట్ చేశాయి.
ఇలాంటి ఉద్రిక్తత మధ్య పాకిస్థాన్ గూఢచార సంస్థ (ISI) భారత్ లో అశాంతి రాజేందుకు రంగంలోకి దిగిందనీ, వివాదానికి ఆజ్యం పోసేలా పావులు కదుపుతోందని నిఘా వర్గాలు (ఇంటెల్ ఇన్పుట్లు) హెచ్చరిస్తున్నాయి. హిజాబ్ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న సందర్భంలో నిషేధిత ఖలిస్థానీ సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (SJF) ద్వారా మరింత నిప్పు రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టు నిఘావర్గాలు హెచ్చరించాయి.
హిజాబ్ అంశాన్ని ఆధారంగా చేసుకుని.. భారత్ వ్యతిరేక శక్తులు... ఉర్దూయిస్థాన్ భావనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలను తాజాగా హెచ్చరించింది. ఈ తరుణంలో సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వాన్ర్ సింగ్ పన్నుతో చేతులు కలిపే అవకాశముందని హెచ్చరించాయి. ఉగ్రవాద సంస్థ SFJ కదిలికపై నిఘా ఉంచాలని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.
రాజస్థాన్, ఢిల్లీ, యుపి, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో 'ఉర్దూస్థాన్'ను రూపొందించడానికి 'హిజాబ్ రెఫరెండం' ఉద్యమాన్ని ప్రారంభించాలని భారతదేశంలోని ముస్లింలకు SFJ పిలుపునిచ్చినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. ఉర్దూస్థాన్ను సృష్టించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ ఉద్యమాన్ని నిర్వహిస్తుందని, ఇందుకు కావాల్సిన నిధులను సమీకరిస్తామంటూ హామీఇవ్వడాన్ని ప్రస్తావించింది.
హిజాబ్ రిఫరెండం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫారమ్ ల్లో కొన్ని స్క్రీన్షాట్లు, చిత్రాలు సోషల్ వైరల్ అయ్యాయి. దేశంలో మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా గురుపత్వంత్ సింగ్ పన్నూ చేసిన ప్రసంగం కూడా వైరల్ అవుతోంది.
ఈ విషయంపై SFJ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మాట్లాడుతూ.. భారతదేశంలో హిజాబ్ ధరించడంపై నిషేధం విధిస్తోందని తప్పుగా పేర్కొన్నారు. ముస్లీంల్లో భయాందోళనలకు గురిచేస్తున్నారు. భారతదేశంలో 'హిజాబ్ నిషేధం' తర్వాత అజాన్, నమాజ్, ఖురాన్లపై కూడా నిషేధం విధించబడుతుందని ఆరోపించారు.
‘‘మోడీ ప్రభుత్వం.. భారత్ ను హిందూ దేశంగా మార్చాలని భావిస్తున్నారనీ, మరి, భారతదేశంలోని 200 మిలియన్ల ముస్లింలను ఏమి చేయాలి? అనుకుంటున్నారని ప్రశ్నించారు. హిజాబ్ రెఫరెండం ఉద్యమాన్ని ప్రారంభించండని, ఇది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. భారత యూనియన్ నుండి ఉర్దూస్థాన్ అనే ముస్లిం దేశాన్ని సృష్టించాలి అని పిలుపు నిచ్చారు.
“1992లో.. బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు, ఆ సమయంలో ముస్లింలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ తరువాత గుజరాత్లో ముస్లింల హత్యలు జరిగాయి. ఆ సమయంలో ముస్లింలు నిశ్శబ్దంగా ఉన్నారు. తాజాగా కాశ్మీర్ను స్వాధీనం చేసుకున్నారు. అయినా.. ముస్లింలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడూ ముస్లీం మత విశ్వాసాలను సవాలు చేస్తున్నప్పుడు కూడా మీరు మౌనంగా ఉంటారా అని పన్నూరెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.