వాజ్పేయీని కరిచిన ప్రణబ్ శునకం..షర్మిష్ఠా ట్వీట్
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ మరణించినప్పటి నుంచి ప్రముఖ నేతలు ఆయనతో తమకున్న మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. అటల్ జీ తో తమకున్న అనుబంధం కానీ ఆయనతో గడిపిన మధుర క్షణాలను పంచుకుంటున్నారు.
ఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ మరణించినప్పటి నుంచి ప్రముఖ నేతలు ఆయనతో తమకున్న మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. అటల్ జీ తో తమకున్న అనుబంధం కానీ ఆయనతో గడిపిన మధుర క్షణాలను పంచుకుంటున్నారు.
తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్టా ముఖర్జీ సైతం వాజ్పేయీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. షర్మిష్టా చిన్నతనంలో ప్రణబ్ ఇంటి పక్కనే వాజ్పేయీ నివాసం ఉండేదట. ఓరోజు వాజ్పేయీ ఉదయం వాకింగ్కి వెళుతుంటే ప్రణబ్ ఇంట్లో ఉన్న పెంపుడు శునకం ఆయన్ని కరిచిందట. ఈ విషయాన్ని షర్మిష్టా ట్విటర్ ద్వారా తెలిపారు. నా చిన్నప్పుడు వాజ్పేయీజీకి జరిగిన ఓ సంఘటన గుర్తుకువచ్చింది.
వాజ్పేయీజీ ఇల్లు మా ఇల్లు పక్కపక్కనే ఉండేవి. ఓసారి వాజ్పేయీజీ ఉదయం వాకింగ్కి వెళుతుంటే మా ఇంట్లో ఉన్న డాకూ(కుక్క పేరు) ఆయన్ను కరిచింది. దాని అరుపులు విని మా అమ్మ గబగబా బయటికి వచ్చి చూసింది. ఆ సమయంలో వాజ్పేయీ నవ్వుతూ కన్పించారు. అంతేకాదు మా అమ్మకు ఇంట్లో పెంచిన ఆకుకూరలను ఇచ్చి పంపేవారు. అలా మా రెండు ఇళ్ల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు, జ్ఞాపకాలు ఎక్కువగా ఉండేవని వెల్లడించారు.