హర్యానాలోని మేవాత్ లో బాలిక విద్య కోసం పాటుపడుతోన్న ముస్లిం మహిళ టీచర్లు షబ్నమ్ , ఆమె అక్క నఫీసాలు తన ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న ఆవరోధాల కథనం.  

బాలిక విద్య కోసం పాటు పడుతోన్న ముస్లిం మహిళ టీచర్లు షబ్నమ్ , ఆమె అక్క నఫీసాను ఆవాజ్ ది వాయిస్‌ టీం కలిసి వారి మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేసింది. షబ్నమ్, ఆమె ఇతర తొమ్మిది మంది సోదరీమణులు, వారి తండ్రి రియాజ్ ఖాన్ కూడా బాలిక విద్య కోసం పాటుపడిన వారే.  షబ్నమ్ తండ్రి రియాజ్ ఖాన్  పంజాబ్ వక్ఫ్ బోర్డులో రెవెన్యూ అధికారిగా పనిచేశారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు, కానీ అతను తన 11 మంది బాలికలలో వెలిగించిన విద్య జ్యోతి నేడు ప్రకాశ జ్వాలగా కీర్తించబడుతోంది. ఆయన ఎనిమిది మంది కుమార్తెలు ఉపాధ్యాయులే.

షబ్నమ్ ఆవాజ్-ది వాయిస్‌తో మాట్లాడుతూ.. ఆమె మన అనుభవాలను ఇలా చెప్పింది. మా  సోదరీమణు లందరూ  ఉపాధ్యాయులే.బాలిక విద్యను ప్రోత్సహించడమే మా ప్రయత్నమంటారు. చాలా మంది బాలికలు తమ చదువును మధ్యలో వదిలిపెట్టి ఇంటికే పరిమితమతున్నారని అన్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల హాజరు సంఖ్య చాలా తగ్గుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి  విద్యార్థినుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి, చదువుపై అవగాహన కల్పించాల్సిమని షబ్నం చెప్పింది.

విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలి. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా మారడానికి ముందు చాలా కాలం పాటు ఎన్జీవోలో పనిచేశాననీ షబ్నమ్ తెలిపారు. తన సోదరీమణులతో పోలిస్తే ఈ ఉద్యోగంలో తనకు పెద్దగా ఇబ్బంది లేదు. ఎన్జీవోలో పిల్లల విద్యపై పనిచేసిన అనుభవం తనకు ఇప్పుడు ఉపయోగపడుతోందనీ, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడంలో చాలా సహాయపడుతుందని ఆమె వెల్లడించారు. షబ్నం ఇప్పుడు రిథోడాలో శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్. 

షబ్నమ్ తో పాటు తన అక్క నఫీసా కూడా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె కూడా తన అభిప్రాయాలను ఆవాజ్ ది వాయిస్ తో పంచుకుంది. చాలా మంది తల్లిదండ్రులు తమ కూతుళ్లు కూడా తమలాగే ఉండాలని కోరుకుంటున్నారని చెప్పడం మొదలుపెట్టారు.

హర్యానాలోని చాలా వెనుకబడిన జిల్లా అయిన నుహ్ లో ప్రధాన సమస్య ఏమిటంటే.. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే.. బాలికల డ్రాపౌట్ శాతం అత్యధికంగా ఉంది. ఇక్కడ అనేక పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు లేకపోవడంతో ఉన్నత విద్య కోసం మేవాత్ వెలుపలకు వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు.

మేవాత్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ అలీ చందైనీ మాట్లాడుతూ.. జిల్లా జనాభాలో దాదాపు 70 నుండి 80 శాతం మంది కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఆర్థిక అవరోధాలు, నిరాశ, కుమార్తెల భద్రత గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుల కోసం పాఠశాలకు పంపే బదులు ఇంట్లో ఉంచడానికి ఇష్టపడతారని తెలిపారు. 

అటువంటి సాంప్రదాయిక వాతావరణాన్ని బద్దలు కొట్టి, 90 లో పంజాబ్ వక్ఫ్ బోర్డులో రెవెన్యూ అధికారిగా ఉన్న రియాజ్ ఖాన్ తన 11 మంది కుమార్తెలకు ఉన్నత విద్యను అందించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన 1993లో యాక్సిడెంట్‌కి గురై వాలంటరీ రిటైర్‌మెంట్‌తో నూహ్‌కి పర్మినెంట్‌గా మారడంతో.. ఆడపిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టారు.  
 
తన తండ్రి,తాతలను ప్రశంసిస్తూ షబ్నమ్ ఇలా చెప్పింది. వారు మా చదువు కోసం చాలా ప్రోత్సహించారు. చదువు విషయంలో మా అక్కాచెల్లెళ్లను  ఎప్పుడూ ఆపలేదని తెలిపారు. వారి ప్రోత్సహంతోనే షబ్నమ్ లా కూడా చదువుకుంది. ఆమె భర్త సోహ్నాలో న్యాయవాది. అయినప్పటికీ రియాజ్ ఖాన్ ఎనిమిది మంది కుమార్తెలు ఉపాధ్యాయులు కావడానికి ఇష్టపడతారు. ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నారు. మాకు మొదటి నుంచి టీచర్లు కావాలనే ఆసక్తి ఉందని షబ్నమ్ అక్క చెబుతోంది.  

షబ్నమ్‌కి ఐదుగురు పిల్లలు. అతని కుమార్తెలలో ఒకరు బనారస్ నుండి ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్ చేసారు. మిగిలిన వారి పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు.  ఇక నఫీసా పెద్ద కొడుకు ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించే విషయంలో తాము కూడా ఎవరి మాట వినడం లేదని షబ్నం, నఫీసా చెబుతున్నారు. పిల్లలు తమ వృత్తిని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఆమె వారికి మాత్రమే మద్దతు ఇస్తుంది. ఇతర సోదరీమణుల పిల్లలు చదువులో బాగా రాణిస్తున్నారని షబ్నమ్ అక్క తెలిపారు. అలాగే.. బాలికల విద్యకు సంబంధించి మేవాటీ ముస్లింలలో వాతావరణం మారుతున్నదని, కానీ అనుకున్న విధంగా మార్పులు జరగడం లేదని అంటున్నారు. ఐదవ, ఎనిమిదో తర్వాత అమ్మాయిలు ఇంట్లో కూర్చుంటారని షబ్నమ్ బాధపడుతోంది. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెలను పాఠశాలకు పంపకుండా మక్తాబ్‌కు పంపడానికి ఇష్టపడతారని మరో విషయం వెల్లడించింది. 

ఏది ఏమైనా.. షబ్నమ్, ఆమె సోదరీమణులు చేస్తున్న ప్రయత్నంతో హర్యానాలోని మేవాత్ లోని పాఠశాల్లో డ్రాప్ అవుట్ శాతం తగ్గుతోంది. ఆడపిల్లలు చదువులో పురోగతి సాధించాలంటే.. అది ఇంటి నుంచే ప్రారంభం కావాలని షబ్నమ్, అక్కాచెల్లెళ్లిద్దరూ అన్నారు. అన్నీ ప్రభుత్వమే కాదు.. స్థానిక రాజకీయ నాయకులు కూడా సంకల్పబలంతో ముందుకు రావాలని అంటున్నారు. 

మేవాత్‌లోని కొందరు రాజకీయ నాయకులను ఉదాహరణగా చూపుతూ..ఉర్దూ ఉపాధ్యాయుల సమస్యపై సమావేశానికి తనను పిలిచారని, అయితే వారెవరూ తన మాట వినడానికి రాలేదని షబ్నమ్ అన్నారు. తాము బాలికల విద్య కోసం ఎంతగా ప్రయత్నిస్తున్న ఇప్పటికీ స్థానిక రాజకీయ నాయకుల నుంచి సరైన స్పందన రావడం లేదనీ, బాలికల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని షబ్నమ్ తన మనోగతాన్ని వెల్లడించారు. 


రియాజ్ ఖాన్ కుమార్తెలు, వారి అర్హతలు:

1- నఫీసా: JBT, B.Ed. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు

2- షబ్నం: MA, LLB, JBT. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

3- అఫ్సానా: JBT, MA, B.Ed.

4- ఫర్హానా: JBT, MA, B.Ed. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు 

5- షహనాజ్: JBT, MA, BEd .ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు

6- ఇష్రత్: బి.ఎ.

7- నుస్రత్: JBT, MA, MEd, మలాబ్ పాలిటెక్నిక్‌లో లెక్చరర్

8- అన: JBT, MA B.Ed.  ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

9- రజియా: MBA, ప్రైవేట్ రంగంలో పని చేస్తున్నారు

10- నాజియా: డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ , ప్రైవేట్ సెక్టార్‌లో పని చేస్తున్నారు.

11- బుష్రా: MA, B.Ed