నర్సు నిర్లక్ష్యం అప్పుడే పుట్టిన పసికందుకు.. నిండునూరేళ్లు నిండేలా చేసింది. మహిళకు ప్రసవం చేసిన నర్సు శిశువును ఒంటిచేత్తో ఎత్తుకోవడంతో జారికిందపడి.. తలకు గాయం కావడంతో మరణించింది.
లక్నో : Uttar Pradeshలోని లక్నోలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. nurse నిర్లక్ష్యానికి ఓ పసికందు ప్రాణం పోయింది. నర్సు చేతిలోంచి జారిపోయి అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందాడు. చింతన్ ప్రాంతంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ baby boyకు జన్మనిచ్చింది. అయితే Towel సాయం లేకుండా శిశువును నర్సు ఒంటి చేత్తో ఎత్తుకోవడంతో ఆ శిశువు జారి కింద పడిపోయింది. దీంతో తలకు గాయమై మృతి చెందింది. ఇది చూసి తల్లి ఆర్తనాదాలు పెట్టడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు డెలివరీ రూమ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే వారిని అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బంది.. మృత శిశువు జన్మించిందని బుకాయించే ప్రయత్నం చేశారు. శిశువు ఆరోగ్యంగానే పుట్టాడని, నర్సు తప్పిదంవల్లే కిందపడి మృతి చెందినట్లు సదరు తల్లి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయం కారణంగానే శిశువు మరణించినట్లు నివేదికలో వెల్లడయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలోని మంచిర్యాలలో 11 నెలల పసికందును దారుణంగా చంపేశాడో కన్నతండ్రి. మంచిర్యాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్నతండ్రే అనుమానంతో ఓ చిన్నారి ఉసురు తీశాడు. భార్య మీద అనుమానంతో కడుపున పుట్టిన కొడుకునే 11నెలల చిన్నారిని పాశవికంగా నేలకేసి కొట్టాడు. పట్టరాని కోపంలో చేసిన ఆ పనితో ఆ పసివాడికి నూరేళ్లు నిండాయి.
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త విచక్షణ కోల్పోయి భార్య చేతిలో ఉన్న పసికందును నేలకేసి కొట్టి ప్రాణాలు పోయేలా చేశాడు. ఈ దారుణ ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పులిమడుగు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మందమర్రి మండలం pulimaduguకు చెందిన నరేష్, జ్యోతి దంపతులకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 11నెలల బాబు ఉన్నాడు. నరేష్ ఇసుక బట్టిలో పనిచేస్తాడు. అయితే, ఈ క్రమంలో తన భార్య జ్యోతిపై అనుమానపడుతుండేవాడు. దీంతో ఇంట్లో ఆమెతో తరచూ గొడవపడుతూ ఉండేవాడు.
అదే సమయంలో ఆదివారం అర్ధరాత్రి తాగి వచ్చిన నరేష్ భార్యతో మల్లోసారి ఘర్షణ పడ్డాడు. ఇష్టానుసారం కొడుతూ భార్య చేతిలో ఉన్న పసికందును నేలకేసి బాదాడు. అనుకోని ఈ పరిణామానికి భార్య తేరుకునేలోపే.. చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు చిన్నారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే కన్నుమూసాడు. దీనిమీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం నిందితుడు నరేష్ పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
ఇక మరో ఘటనలో.. భర్తతో గొడవపడి ఓ మహిళ తన మూడు నెలల పసికందును గొంతు కోసి murder చేసిన ఘటన న్యూ ఢిల్లీలో కలకలం రేపింది. ఈ మేరకు పోలీసులు ఏప్రిల్ 6న వివరాలు వెల్లడించారు. వాయువ్య ఢిల్లీలోని షాలిమార్ బాగ్కు చెందిన నిందితురాలు అంజలీ దేవి(26)ని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 2.14 గంటలకు పసికందును ఆమె తల్లి హత్య చేసినట్లు పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మహిళ తన మెడలోని దారంతో శిశువు గొంతుకు బిగించి చంపినట్లు తెలిసింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్వెస్ట్) ఉషా రంగాని తెలిపారు.
