CJI N V Ramana: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రిన్సిపల్ కార్యదర్శి అమన్ సింగ్, ఆయన భార్య యాస్మిన్ సింగ్పై అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసును ఛత్తీస్గఢ్ హైకోర్టు 2020లో కొట్టివేసింది. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కార్యకర్త ఉచిత్ శర్మ పిటిషన్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్ సందర్భంగా .. సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వం జడ్జీలను దూషించడమనేది.. కొత్త ట్రెండ్ గా మారిందని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి కుయుక్తులకు ప్రైవేటు వ్యక్తులు పాల్పడేవారని, ప్రస్తుతం ప్రభుత్వమే అలాంటి వాటికి పాల్పడుతున్నదని విమర్శించారు.
CJI N V Ramana: న్యాయమూర్తులను దూషించే కొత్త ఒరవడిని ప్రభుత్వం ప్రారంభించిందని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ విమర్శించారు. ఈ చర్యను దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. న్యాయమూర్తులపై ప్రభుత్వం దుష్ప్రచారం ప్రారంభించిందని అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి దుశ్చర్యలకు ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు పాల్పడేవారని, ప్రస్తుతం ప్రభుత్వమే అలాంటి వాటికి పాల్పడుతుండటం దురదృష్టకరమని విమర్శించారు. తాము ప్రతిరోజు కోర్టుల్లో వీటిని చూస్తున్నామని CJI అన్నారు.
బీజేపీకి చెందిన ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అతని ప్రిన్సిపల్ సెక్రటరీ అమన్ కుమార్ సింగ్, ఆయన భార్య యాస్మిన్ సింగ్పై అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్ను ఛత్తీస్గఢ్ హైకోర్టు 2020లో కొట్టివేసింది. అయితే.. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ముగ్గురు అవినీతిపై దర్యాప్తు జరుపాలని ప్రముఖ సామాజిక కార్యకర్త ఉచిత్ శర్మ సుప్రీం కోర్టుకు ఆశ్రయించాడు. అదే సమయంలో వీరి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అలాగే.. హైకోర్టు ఉత్తర్వులపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దాఖాలు చేసిన పిటిషన్తో సహా రెండు ప్రత్యేక పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమా కొహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే న్యాయస్థానాన్ని ఆగ్రహానికి గురిచేసిన అంశం ఏమిటన్నది స్పష్టం కాలేదు.
మాజీ ప్రిన్సిపల్ కార్యదర్శి అమన్ సింగ్ పై దాఖాలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి గల కారణం సంభావ్యంగా లేదనీ ఒక పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే.. న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ముందు సమర్పించారు. అయితే.. ఈ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి ఇలా వ్యాఖ్యానించారు.. "కోర్టులను కించపరచడానికి ప్రయత్నించవద్దు. ఇలాంటి కోర్టులో చాలానే చూస్తున్నాను.... అని అన్నారు.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది వాదిస్తూ.. తాము ఆ అంశాన్ని అస్సలు నొక్కి చెప్పడం లేదని వాదించారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి రమణ ఇలా అన్నారు: "లేదు, మేము ప్రతిరోజూ చూస్తున్నాము. మీరు సీనియర్ న్యాయవాది, మీరు మా కంటే ఎక్కువగా దీనిని చూశారు. ఇది ఒక కొత్త ధోరణి, ప్రభుత్వం న్యాయమూర్తులను దూషించడం ప్రారంభించింది, ఇది దురదృష్టకరం." అని
వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాము ఎవరినీ కించపరచలేదని దవే కోర్టుకు తెలియజేశారు.
ఊహాగానాలు, ఆరోపణల ఆధారంగా, ఒకరిని బలిపశువుగా మార్చలేమనీ బెంచ్ పేర్కొంది. అయితే.. ఇది ఊహాగానాలు కాదని, ఎవరైనా రూ. 2,500 కోట్లు కూడబెట్టారని, ఇది దిగ్భ్రాంతికరమని దవే పేర్కొన్నందున, స్పెషల్ లీవ్ పిటిషన్ అతిశయోక్తి అని ధర్మాసనం పేర్కొంది. ఇది సమయంలో.. తాను సర్వీస్లో చేరినప్పుడు రూ.11 లక్షల విలువైన ఒక ఆస్తి ఉందని, ఇప్పుడు రూ.2.76 కోట్ల విలువైన 7 ఆస్తులను కొనుగోలు చేశానని ద్వివేది ప్రతివాదికి సమర్పించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.