సారాంశం
భారతీయ ముస్లింలలోని కుల వ్యవస్థ అకాడమిక్ సర్కిల్స్లో తరచుగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఇతర చోట్ల నిశ్శబ్దంగా ఉంది.
భారతీయ ముస్లింలలోని కుల వ్యవస్థ అకాడమిక్ సర్కిల్స్లో తరచుగా చర్చనీయాంశమైంది. మరోవైపు ఇతర చోట్ల నిశ్శబ్దంగా ఉంది. చాలా మంది.. ముఖ్యంగా అగ్రవర్ణ ప్రజలు ఇది ఆధునిక రాజకీయ నాయకుల ఆవిష్కరణ అని నమ్ముతారు. మరికొందరు మాత్రం దీనిని అతిశయోక్తి చేసినందుకు ఉన్నత విద్యాసంస్థలను నిందించారు. నేను ఈ విషయాన్ని వివరించడానికి ప్రయత్నించినప్పుడల్లా.. నేను రెండు వ్యతిరేక ప్రతిచర్యలను ఎదుర్కొంటాను. ఒకటి.. కింది కులస్థుల నోరు మూయించేందుకు ప్రయత్నిస్తున్న నన్ను అగ్రవర్ణ ముస్లిం అని ప్రజలు నిందిస్తారు. రెండోవది.. కొన్ని విచిత్రమైన కారణాల వల్ల నా జేఎన్యూ స్టింట్ ఈ కోణంలో ఆలోచించేలా చేస్తుందని అనుకుంటారు.
ముస్లింలలోని కుల వ్యవస్థ, నిమ్న కులాల పట్ల శతాబ్దాలుగా అనుసరిస్తున్న నిశ్శబ్దం, బహిష్కరణ, వివక్ష గురించి నా పరిచయం ఆధునిక ఆంగ్ల విద్యా విధానంలోని ఏ పండితుడు కూడా నాకు బోధించలేదు. మా తాత (నాకు అబ్బాజీ) మహ్మద్ హషీమ్.. ఇస్లామిక్ పండితుడు. నాకు ఈ చీకటి వాస్తవాన్ని ఆయనే పరిచయం చేశారు.
నేను ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని ముజఫర్నగర్, సహరాన్పూర్, హరిద్వార్ జిల్లాలలో కనిపించే స్థానిక కులమైన గారా కమ్యూనిటీకి చెందినవాడిని. సాంప్రదాయకంగా, ఈ కుల ప్రజలు వ్యవసాయదారులు, భూమి యజమానులు. సామాజికంగా వారు ఆ ప్రాంతంలోని జాట్లతో సమానంగా ఉన్నారు. అయితే 20వ శతాబ్దపు ప్రారంభంలో ఆర్థికంగా బాగా ఉన్నప్పటికి.. గారాలు ఎక్కువగా చదువుకోలేదు.
అబ్బాజీ (తాత) 1918లో జన్మించారు. ఆయన ముజఫర్నగర్లోని దాధేరు అనే గ్రామంలో నివసించారు. అవి భారతదేశంలో సామాజిక, విద్యాపరమైన మేల్కొలుపు జరుగుతున్న సమయం. దీంతో కుటుంబం అంటరానిది కాలేదు. హఫీజ్ అమీరుద్దీన్ ఆధ్వర్యంలో అబ్బాజీ ఇస్లామిక్ బోధనలు నేర్చుకున్నారు. అబ్బాజీ తన యుక్తవయస్సులో ఖురాన్ను కంఠస్థం చేశారు. తెలివైన విద్యార్థిగా ఆయన గుర్తింపు పొందారు. ముస్లింలలో ఖురాన్ కంఠస్థం చేసిన యువ పండితులు రంజాన్ సందర్భంగా తరావీహ్ ప్రార్థనలకు నాయకత్వం వహిస్తారు. తరావీహ్ అనేది సుదీర్ఘ నమాజ్.. ఇక్కడ రంజాన్లో ప్రతి రోజు ఖురాన్లోని ఒక అధ్యాయం పఠిస్తారు. ఈ విధంగా పవిత్ర మాసంలో ఖురాన్లోని 30 అధ్యాయాలు పూర్తవుతాయి.
1933లో అబ్బాజీ తారావీహ్ ప్రార్థనలకు నాయకత్వం వహించాలని ఆయన గురువు నిర్ణయించుకున్నారు. అబ్బాజీ తెలివైన విద్యార్థి కావడంతో ఆయన ఉత్తమ ఇస్లామిక్ పండితుల ముందు ఖురాన్ పఠించాలని కోరుకున్నారు. ఆ సమయంలో అబ్బాజీ ఆయన జీవితంలోని అతి ముఖ్యమైన పాఠాలలో ఒకదాన్ని నేర్చుకున్నారు.
ఆ రోజుల్లో దియోబంద్ సమీపంలోని మంగ్లౌర్ అనే పట్టణం ఇస్లామిక్ పండితులకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం 19వ, 20వ శతాబ్దంలో అనేక మంది ఇస్లామిక్ పండితులను తయారు చేసింది. ఇక్కడే మా తాతయ్యను అరంగేట్రం చేయమని అడిగారు.
రంజాన్ మొదటి రోజున.. యువ హషీమ్ (అబ్బాజీ)ని పట్టణంలోని సీనియర్ వ్యక్తి అయిన ఖాజీ అబ్దుల్ ఘనీ, ఒక ఉన్నత కులస్థుడు ప్రార్థనలకు నాయకత్వం వహించమని పిలిచారు. మసీదులో ఉన్న ప్రజలను.. యువకుడు హషీమ్ ఎంత ఖురాన్ చదవాలనుకుంటున్నారో చెప్పమని ఘనీ అడిగాడు. అక్కడ గుమిగూడిన ప్రజల నుండి ఆమోదం పొందడం ఒక సాధారణ ఆచారం. ‘‘గారే కా లడ్కా హై, కిత్నా హీ పధ్ లేగా. పధ్నే దీజియే (అతను గారా అబ్బాయి. ఎంత పారాయణ చేయగలడు? పారాయణం చేయనివ్వండి)’’ అని అక్కడ ఎవరో ఒక్కరు వ్యాఖ్యానించారు.
ఒక అగ్రవర్ణ వ్యక్తి చేసిన ఈ కుల దూషణను అక్కడ ఉన్న ఇతరులు ఆమోదించారు. హషీమ్ అనే యువకుడికి కుల వ్యవస్థ కఠినమైన వాస్తవికత పరిచయం చేయబడింది. కుల వివక్షను ప్రదర్శించడానికి మసీదు వంటి సమానత్వ స్థలం ఉపయోగించబడింది. అయితే ఉన్నత కులానికి చెందిన పెద్దమనిషితో సహా అతని గురువులు లేకుంటే అబ్బాజీ ఇబ్బందిపడేవాడు.
ఘని యువ హషీమ్ ఒక మూలకు తీసుకెళ్ళి ‘‘జిత్నీ హిమ్మత్ హై ఉత్నా పెహ్లీ దో రకత్ మే పధ్ దేనా (తరావీహ్ మొదటి రెండు రకాత్లలో ఖురాన్ను మీకు వీలైనంత ఎక్కువ చదవండి)’’ అని చెప్పారు. విధేయుడైన విద్యార్థి హాషిమ్.. కులతత్వ దూషణలను తప్పు అని నిరూపించే దృఢ నిశ్చయంతో పఠించడం ప్రారంభించారు. యువ హషీమ్ మొదటి రెండు రకాత్లలో ఖురాన్లోని 30 అధ్యాయాలలో 20 అధ్యాయాలను పఠించాడు. అతని జీవితంలో మొదటి తరావీహ్ అయిన రాత్రి మొత్తం ఖురాన్ను పూర్తి చేశాడు.
తరావీహ్ పూర్తయ్యాక అక్కడ కొందరు మసీదులోనే ఉండిపోయారు. ఒక తరావీహ్లో ఖురాన్ మొత్తం పఠించే ఫీట్ను షబీనా అని పిలుస్తారు. ఇది ఒక విజయంగా పరిగణించబడుతుంది. షబీనాను ఇష్టానుసారంగా చదవగలిగే వ్యక్తిగా అబ్బాజీ పేరు తెచ్చుకున్నారు. అబ్బాజీ తన విమర్శకుల నోళ్లను తొలి తారావీహ్లోనే మూయించగలిగారు. అయితే మసీదులు కుల వివక్షకు అతీతం కాదనే కఠోర వాస్తవాన్ని ఆ ఎపిసోడ్ ఆయనను గ్రహించేలా చేసింది.
అది జరిగి దాదాపు 70 సంవత్సరాలు గడిచిపోయాయి.. అది 2002 నాటి రంజాన్. మేము మా ఇంట్లో పడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కొందరు వ్యక్తులు మా తలుపు తట్టారు. బయటకు వచ్చి చూస్తే.. సమీపంలోని ప్రాంతంలోని అగ్రవర్ణాల ప్రజలు పెద్ద సంఖ్యలో గుంపులుగా ఉన్నారు. వీరు తరావీహ్ సమయంలో పారాయణం గురించిన సమస్యపై తమలో తాము పోట్లాడుకున్నట్టుగా తెలిసింది.
ఒక సమూహం.. ఎక్కువగా పెద్దలు పారాయణం చేసే వ్యక్తి తన పారాయణ పథకంలో తప్పు అని నమ్మారు. మరికొందరు ఎక్కువగా యువకులు ఆ మనిషికి మద్దతు ఇస్తున్నారు. అందుకే అబ్బాజీని నిద్ర లేపి అతని అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తరావీహ్కు నాయకత్వం వహించే వ్యక్తికి అనుకూలంగా అబ్బాజీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. సీరియస్గా తీసుకోకూడని నిమ్నజాతి కుర్రాడిగా తిరస్కరించబడినప్పటి నుంచి అగ్రవర్ణాల వారిచే పండితుడిగా గౌరవించబడే వరకు అబ్బాజీ సాగించిన ప్రయాణం అంత సులభం కాదు. కుల ఆధారిత వివక్ష, సామాజిక న్యాయం ఆలోచనల గురించి నేను నా మొదటి పాఠాలను ఈ విధంగా నేర్చుకున్నాను.
(-సాకిబ్ సలీం)