అయితే పంకజ్ వాళ్ల తండ్రి కమల్ రాజ్కు కొడుకు నందినినని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.
కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి తండ్రికి నచ్చలేదు. కొడుకు, కోడలిని ఎలాగైనా విడదీయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో.. కొడుకు లేని సమయం చూసుకొని కోడలిని హతమార్చేశాడు. అనంతరం శవాన్ని మూటగట్టి పడేశాడు. ఇటీవల ముంబయి బీచ్ లో ఓ మహిళ శవం దొరికింది కదా.. అది ఈ ఘటనకు సంబంధించినదే కావడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఈస్ట్ కాందివ్లీకి చెందిన పంకజ్ని మూడు సంవత్సరాల క్రితం నందిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పంకజ్ వాళ్ల తండ్రి కమల్ రాజ్కు కొడుకు నందినినని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అంతేగాక ఆమె క్యారెక్టర్పై అనుమానం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పని నిమిత్తం పంకజ్ వేరే ఊరికి వెళ్లాడు.
ఇదే అదునుగా భావించిన మామ కమల్ రాజ్ కోడలిని ఎలా అయినా అంతమొందించాలని పన్నాగం పన్నాడు. దీంతో డిసెంబర్ 9న కమల్.. ఇద్దరు స్నేహితులతో కలసి నందిని నిద్రిస్తున్న సమయంలో ఆమె చేతులు కాళ్లు కట్టేసి దిండుతో నొక్కి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ప్యాక్ చేసి దానిని కండివిల్లి ప్రాంతంలోని నాలాలో విసిరేశారు.
డిసెంబర్ 24న మృతదేహం కలిగిన గోనె సంచి ఆక్షా బీచ్కు చేరుకుంది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దానిని తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసులో మామతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 31, 2020, 8:30 AM IST